తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్ణాటకీయం: బలపరీక్షకు ముందు కుమారస్వామికి ఊరట - Kumaraswami

నేటి విశ్వాస పరీక్షకు ముందు కుమార స్వామికి కాస్త ఊరటనిచ్చారు కాంగ్రెస్​ సీనియర్​ నేత రామలింగారెడ్డి. ఈ ఉదయం స్పీకర్​తో సమావేశమై రాజీనామాను ఉపసంహరించుకోనున్నట్లు స్పష్టం చేశారు. బల పరీక్షలో కుమారస్వామికే మద్దతిస్తానని తెలిపారు. కాంగ్రెస్​ నేతలతో పాటు ముఖ్యమంత్రితో చర్చల అనంతరం బుధవారం రాత్రి ఈ మేరకు ప్రకటన చేశారు.

కర్ణాటకీయం: బలపరీక్షకు ముందు కుమారస్వామికి ఊరట

By

Published : Jul 18, 2019, 7:09 AM IST

Updated : Jul 18, 2019, 7:23 AM IST

కీలకమైన బల పరీక్షకు ముందు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి కాస్త ఊరట లభించింది. కాంగ్రెస్​ సీనియర్​ నేత రామలింగారెడ్డి తన రాజీనామాను ఉపసంహరించుకుంటానని ప్రకటించారు. అలాగే నేడు విధానసభకు హాజరవుతున్నట్లు తెలిపారు. విశ్వాస పరీక్షలో కుమారస్వామి​కే తాను మద్ధతిస్తానని స్పష్టం చేశారు. ఈ ఉదయం 11 గంటలకు అవిశ్వాస తీర్మానంపై కన్నడ అసెంబ్లీలో చర్చ జరగనుంది. అనంతరం కుమార స్వామి బల పరీక్షను ఎదుర్కోనున్నారు.

చర్చల అనంతరం

ఈ నెల 6న రాజీనామా చేసిన రామలింగారెడ్డితో సీఎం కుమారస్వామి, కొందరు కాంగ్రెస్​ నేతలు చర్చలు జరిపారు. అనంతరం బుధవారం రాత్రి తాను కుమారస్వామికే మద్దతిస్తానని ప్రకటించారు రామలింగారెడ్డి. గురువారం స్పీకర్​తో సమావేశమై రాజీనామాను ఉపసంహరించుకుంటానని స్పష్టం చేశారు.

రామలింగారెడ్డి మద్దతుతో కాంగ్రెస్​-జేడీఎస్​ సంకీర్ణ ప్రభుత్వం బలం 102 కు చేరనుంది. అయనతో పాటు మరో నలుగురు ఎమ్మెల్యేలు కూడా తనకు మద్దతిస్తారని కుమారస్వామి ఆశిస్తున్నారు. ఒకవేళ మిగతా 15 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్​కు రాకపోతే సభలో సభ్యులు సంఖ్య 208కి చేరనుంది. ఈ తరుణంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్​ ఫిగర్​(105)కు మరో మూడడుగుల దూరంలోనే నిలిచిపోనుంది కుమార సర్కారు. అదే జరిగితే ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో 107 మంది ఎమ్మెల్యేల బలాన్ని సాధించిన భాజపా ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేయనుంది.

Last Updated : Jul 18, 2019, 7:23 AM IST

ABOUT THE AUTHOR

...view details