కరోనా విజృంభిస్తున్న వేళ... ప్రయాణికుల భద్రత కోసం రైల్వే శాఖ ప్రత్యేక సౌకర్యాలతో కూడిన బోగీలను తయారు చేసే పనిలో నిమగ్నమైంది. ఈ మేరకు కపుర్తలా కోచ్ ఫ్యాక్టరీలో అధునాతన సౌకర్యాలతో కూడిన రెండు బోగీలను ప్రయోగాత్మకంగా నిర్మించింది. నాన్-ఏసీ బోగి కోసం 3 లక్షలు, ఏసీ బోగికి 6లక్షల రూపాయలు వెచ్చించినట్లు రైల్ కోచ్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ రవీందర్ గుప్తా తెలిపారు.
బోగిల్లో ప్రయాణికులు కరోనా బారిన పడకుండా సౌకర్యాలు కల్పించినట్లు రవీందర్ చెప్పారు. కాలుతో ఆపరేట్ చేసే విధంగా నీటి కొళాయిలు, చెత్తడబ్బాలు, టాయిలెట్ ఫ్లష్లు, ముంజేయితో తెరిచేలా డోర్ హ్యాండిల్స్ వంటి సౌకర్యాలు ఉన్నట్లు వివరించారు.