పోలీసు కాల్పుల్లో హతమైన కరుడుగట్టిన నేరస్థుడు వికాస్ దుబేకు చెందిన ఇద్దరు అనుచరులను మహారాష్ట్ర ఠాణెలో ఉగ్రవాద వ్యతిరేక దళ అధికారులు అరెస్టు చేశారు. ఇటీవల ఉత్తర్ప్రదేశ్లో జరిగిన ఎన్కౌంటర్లో 8 మంది పోలీసులను హతమార్చిన ఘటనలో వీరు కూడా నిందితులని తెలిపారు.
ముంబయిలో ఇద్దరు దుబే అనుచరుల అరెస్టు - దుబే అనుచరులను అరెస్టు చేసిన ఉగ్రవాద వ్యతిరేక దళం
మహారాష్ట్ర ఠాణెలో మాఫియా డాన్ వికాస్ దుబేకు చెందిన ఇద్దరు అనుచరులను ఉగ్రవాద వ్యతిరేక దళం అరెస్టు చేసింది. వీరు ఉత్తర్ప్రదేశ్లోని 8 మంది పోలీసుల హత్య కేసులో నిందితులుగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
![ముంబయిలో ఇద్దరు దుబే అనుచరుల అరెస్టు Kanpur killing of cops: 2 aides of Vikas Dubey held in Thane](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7984425-thumbnail-3x2-asp.jpg)
ముంబయిలో ఇద్దరు దుబే అనుచరుల అరెస్టు
వీరిలో ఒకరు అరవింద్ అలియాస్ త్రివేది అని, మరొకరు అతని డ్రైవర్ సోను తివారీగా గుర్తించారు. 2001లో ఉత్తర్ప్రదేశ్ మాజీ మంత్రి హత్య కేసులో కూడా నిందితులుగా ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి:ఒకటే వేదిక.. వరుడొక్కడు.. వధువులిద్దరు!