తెలంగాణ

telangana

By

Published : Jul 11, 2020, 4:01 PM IST

ETV Bharat / bharat

ముంబయిలో ఇద్దరు దుబే అనుచరుల అరెస్టు

మహారాష్ట్ర ఠాణెలో మాఫియా డాన్ వికాస్​ దుబేకు చెందిన ఇద్దరు అనుచరులను ఉగ్రవాద వ్యతిరేక దళం అరెస్టు చేసింది. వీరు ఉత్తర్​ప్రదేశ్​లోని 8 మంది పోలీసుల హత్య కేసులో నిందితులుగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

Kanpur killing of cops: 2 aides of Vikas Dubey held in Thane
ముంబయిలో ఇద్దరు దుబే అనుచరుల అరెస్టు

పోలీసు కాల్పుల్లో హతమైన కరుడుగట్టిన నేరస్థుడు వికాస్​ దుబేకు చెందిన ఇద్దరు అనుచరులను మహారాష్ట్ర ఠాణెలో ఉగ్రవాద వ్యతిరేక దళ అధికారులు అరెస్టు చేశారు. ఇటీవల ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో 8 మంది పోలీసులను హతమార్చిన ఘటనలో వీరు కూడా నిందితులని తెలిపారు.

దుబే అనుచరులు

వీరిలో ఒకరు అరవింద్ అలియాస్ త్రివేది అని, మరొకరు అతని డ్రైవర్​ సోను తివారీగా గుర్తించారు. 2001లో ఉత్తర్​ప్రదేశ్ మాజీ మంత్రి హత్య కేసులో కూడా నిందితులుగా ఉన్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:ఒకటే వేదిక.. వరుడొక్కడు.. వధువులిద్దరు!

ABOUT THE AUTHOR

...view details