తెలంగాణ

telangana

రౌడీషీటర్ల దాడిలో 8 మంది పోలీసులు మృతి

By

Published : Jul 3, 2020, 7:12 AM IST

Updated : Jul 3, 2020, 7:58 AM IST

ఉత్తర్​ప్రదేశ్ కాన్పుర్​లో రౌడీషీటర్ల దాడిలో 8 మంది పోలీసులు మరణించగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. రౌడీషీటర్ వికాస్ దూబేను పట్టుకునేందుకు పోలీసులు ఆపరేషన్ నిర్వహించగా... నిందితులు విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడ్డారు. పరారీలో ఉన్న దుండగుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

Kanpur: 8 police personnel killed during raid to nab history-sheeter
రౌడీషీటర్ల దాడిలో 8 మంది పోలీసులు మృతి

ఉత్తర్​ప్రదేశ్ కాన్పుర్​లో దారుణం జరిగింది. రౌడీషీటర్​ వికాస్​ దూబేను పట్టుకునేందుకు చేపట్టిన ఆపరేషన్​లో... దుండగుడి అనుచరులు పోలీసులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎనిమిది మంది పోలీసులు అమరులవ్వగా, ఏడుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

రౌడీషీటర్ల దాడిలో 8 మంది పోలీసులు మృతి

మృతుల్లో డీఎస్పీ దేవేంద్ర మిశ్రా, ముగ్గురు సబ్​ ఇన్​స్పెక్టర్లు, నలుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. గాయపడిన వారిలో ఎస్​ఓ బీతూర్ సహా ఏడుగురు పోలీసు సిబ్బంది ఉన్నారు.

"రౌడీషీటర్ వికాస్​ దూబేను పట్టుకునేందుకు చౌబేపుర్​ పోలీసుస్టేషన్ పరిధిలోని విక్రూ గ్రామానికి పోలీసులు వెళ్లారు. అయితే దుండగులు తాము తలదాచుకున్న ఇంటిపై నుంచి కాల్పులకు తెగబడ్డారు. ఈ దారుణ ఘటనలో 8 మంది పోలీసులు అమరులయ్యారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు."

- పోలీసులు

వికాస్​ దూబేపై 60 వరకు క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని... వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు.

మృతుల కుటుంబాలకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఇదీ చూడండి:కరోనా బాధితులకు పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం

Last Updated : Jul 3, 2020, 7:58 AM IST

ABOUT THE AUTHOR

...view details