తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాజకీయ 'మైత్రి'కి రజనీ-కమల్​ సిద్ధం! - రజనీకాంత్​.

తమిళనాడు ప్రజల సంక్షేమం కోసం కమల్​ హాసన్​తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు రజనీకాంత్​. గతంలో కమల్​ కూడా రజనీతో కలిసి పనిచేయడానికి సిద్ధమని వ్యాఖ్యానించారు. వీరి వ్యాఖ్యలతో తమిళ రాజకీయాల్లో కొత్త మైత్రి ఆవిర్భవించనుందన్న ఊహాగానాలు మరింత పెరిగాయి.

రాజకీయ 'మైత్రి'కి రజనీ-కమల్​ సిద్ధం!

By

Published : Nov 20, 2019, 6:47 AM IST

Updated : Nov 20, 2019, 8:06 AM IST

రజనీకాంత్​, కమల్​హాసన్​... భారత సినీ రంగ దిగ్గజాలు. ఒకరు సూపర్​ స్టార్​, మరొకరు లోకనాయకుడు. తెరపై ఎన్నోసార్లు కలిసి నటించి అభిమానులను మెప్పించారు. ఇప్పుడు వీరు మరోసారి కలిసి పనిచేయడానికి సన్నద్ధమవుతున్నారా? రీల్​ లైఫ్​లో ఎన్నో అద్భుతాలు సృష్టించిన వీరు.. రియల్​ లైఫ్​లో తమిళనాడు అభివృద్ధి కోసం ఒకటవ్వనున్నారా? వీరి వ్యాఖ్యలతో ఈ ప్రశ్నలకు సానుకూల సమాధానాలు దొరికినట్టే కనిపిస్తోంది.

కమల్​ మాట....

కమల్​, రజనీ.. ఇటీవలి కాలంలో రాజకీయాల్లో ఎంతో చురుకుగా పనిచేస్తున్నారు. మక్కల్​ నీథి మయం పార్టీని స్థాపించారు కమల్​. 2021 రాష్ట్ర ఎన్నికల్లోగా పార్టీని స్థాపిస్తానని రజనీకాంత్​ ఇప్పటికే స్పష్టం చేశారు.

అగ్ర నటుల రాజకీయ మైత్రిపై సంకేతాలు తొలుత కమల్​ నుంచే వచ్చాయి. తమిళనాడు అభివృద్ధి కోసం రజనీతో కలిసి పనిచేస్తానని చెప్పారు కమల్​. అప్పటి నుంచి రజనీ-కమల్​ రాజకీయ పొత్తుపై జోరుగా ఉహాగానాలు పెరిగిపోయాయి. అయితే రాజకీయంగా అది వీలవుతుందో లేదో చెప్పలేమని కమల్ అన్నారు.

రజనీకాంత్​ మాట...

ఆ ఊహాగానాలను రజనీ మరింత పెంచారు. మంగళవారం గోవాకు పయనమైన సూపర్​స్టార్​.. చెన్నై విమానాశ్రయంలో విలేఖరులతో మాట్లాడారు. ప్రజల అభివృద్ధి కోసం కమల్​ హాసన్​తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.

రజనీ వ్యాఖ్యలు

"ప్రజల అభివృద్ధి కోసం నేను, కమల్​ కలిసి పనిచేయాల్సిన అవసరం వస్తే.. కచ్చితంగా చేతులు కలుపుతాం."
--- రజనీకాంత్​.

స్నేహ బంధం...

రాజకీయాల్లో ఏదైనా సాధ్యపడుతుందని.. ఏదీ ఏమైనా కమల్​తో ఉన్న 43ఏళ్ల స్నేహం బలహీనపడదని రజనీకాంత్​ స్పష్టం చేశారు.

1975లో విడుదలైన అపూర్వ రాగంగళ్​తో వెండితెరకు పరిచయమయ్యారు రజనీ. ఆ సినిమాలో కథానాయకుడు కమల్​ హాసన్.

ఇదీ చూడండి:దిల్లీ వాయు కాలుష్యంపై నేడు పార్లమెంటరీ కమిటీ భేటీ

Last Updated : Nov 20, 2019, 8:06 AM IST

ABOUT THE AUTHOR

...view details