తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంగాల్​లో భాజపా అభ్యర్థికి 'ఒక తన్ను- రెండు ఓట్లు' - కలియాగంజ్​

బంగాల్​ ఉప ఎన్నికల్లో భాజపా ఘోర పరాభవం చవిచూసింది. కలియాగంజ్​ స్థానం నుంచి పోటీ చేసిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు జయ్​ ప్రకాశ్​ మజుందార్​ ఓటమి చెందారు. ఎన్నికల రోజున ఘియాఘాట్​ గ్రామంలో ఆయనపై దాడి జరిగింది. ముళ్లపొదల్లో పడిపోయారు. కానీ ఓటర్ల నుంచి సానుభూతి సంపాదించలేకపోయారు. దాడి జరిగిన 32వ బూత్​లో ఆయనకు కేవలం రెండంటే రెండే ఓట్ల రావటం గమనార్హం.

Kaliaganj Assembly bypoll
బంగాల్​లో భాజపా అభ్యర్థికి 'ఒక తన్ను- రెండు ఓట్లు'

By

Published : Nov 28, 2019, 6:41 PM IST

Updated : Nov 28, 2019, 7:05 PM IST

పోలింగ్ సమయంలో భాజపా అభ్యర్థిపై జరిగిన దాడి దృశ్యాలు

ఎన్నికల్లో గెలిచేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు రాజకీయ నేతలు. ప్రజల నుంచి సానుభూతి పొందేందుకు కొందరు ప్రమాదాలు జరిగినట్లు సృష్టించిన విషయాలు సినిమాల్లో చూసి ఉంటాం. కానీ.. బంగాల్ ఉప​ ఎన్నికల్లో పోలీసుల సాక్షిగా భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు జయ్​ప్రకాశ్​ మజుందార్​పై దాడి జరిగినా.. ప్రజల్లో ఆయనపై సానుభూతి కలగలేదు. ఓట్లూ పడలేదు. అందుకు.. ఆయనపై దాడి జరిగిన పోలింగ్​ బూత్​లో రెండంటే రెండే ఓట్ల రావటమే నిదర్శనం.

ఈ నెల 25న పోలింగ్​ జరుగుతున్న సమయంలో కలియాగంజ్​ నియోజకవర్గం ఘియాఘాట్​ గ్రామంలోని 32, 33 నెంబరు పోలింగ్​ కేంద్రాలను సందర్శించేందుకు వచ్చారు భాజపా అభ్యర్థి జయ్​ ప్రకాశ్​ మజుందార్​. ఆ సమయంలో ఆయనపై దాడి జరిగింది. ఓ వ్యక్తి కాలితో తన్నగా మజుందార్ ముళ్లపొదల్లో పడిపోయారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. ఎన్నికల సంఘం దర్యాప్తుకు ఆదేశించింది.

ఆ ఘటన మినహా మూడు అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నేడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటించింది ఎన్నికల సంఘం. అయితే.. కలియాగంజ్​ స్థానంలో పోటీ చేస్తున్న భాజపా అభ్యర్థిపై దాడి జరిగిన 32వ పోలింగ్​ బూత్​లో ఆయనకు రెండే ఓట్లు వచ్చాయి. 33వ బూత్​లో 38 ఓట్లు వచ్చాయి.

కలియాగంజ్​లో భాజపా అభ్యర్థి జయ్​ప్రకాశ్​ మజుందార్​ పరాజయం పాలయ్యారు. ఆయనపై టీఎంసీ అభ్యర్థి సుమారు 2,418 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.

ఇదీ చూడండి: బంగాల్​ సెమీ ఫైనల్​లో దీదీ క్లీన్ స్వీప్​- భాజపాకు షాక్

Last Updated : Nov 28, 2019, 7:05 PM IST

ABOUT THE AUTHOR

...view details