తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంగాల్​లో భాజపా అభ్యర్థికి 'ఒక తన్ను- రెండు ఓట్లు'

బంగాల్​ ఉప ఎన్నికల్లో భాజపా ఘోర పరాభవం చవిచూసింది. కలియాగంజ్​ స్థానం నుంచి పోటీ చేసిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు జయ్​ ప్రకాశ్​ మజుందార్​ ఓటమి చెందారు. ఎన్నికల రోజున ఘియాఘాట్​ గ్రామంలో ఆయనపై దాడి జరిగింది. ముళ్లపొదల్లో పడిపోయారు. కానీ ఓటర్ల నుంచి సానుభూతి సంపాదించలేకపోయారు. దాడి జరిగిన 32వ బూత్​లో ఆయనకు కేవలం రెండంటే రెండే ఓట్ల రావటం గమనార్హం.

By

Published : Nov 28, 2019, 6:41 PM IST

Updated : Nov 28, 2019, 7:05 PM IST

Kaliaganj Assembly bypoll
బంగాల్​లో భాజపా అభ్యర్థికి 'ఒక తన్ను- రెండు ఓట్లు'

పోలింగ్ సమయంలో భాజపా అభ్యర్థిపై జరిగిన దాడి దృశ్యాలు

ఎన్నికల్లో గెలిచేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు రాజకీయ నేతలు. ప్రజల నుంచి సానుభూతి పొందేందుకు కొందరు ప్రమాదాలు జరిగినట్లు సృష్టించిన విషయాలు సినిమాల్లో చూసి ఉంటాం. కానీ.. బంగాల్ ఉప​ ఎన్నికల్లో పోలీసుల సాక్షిగా భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు జయ్​ప్రకాశ్​ మజుందార్​పై దాడి జరిగినా.. ప్రజల్లో ఆయనపై సానుభూతి కలగలేదు. ఓట్లూ పడలేదు. అందుకు.. ఆయనపై దాడి జరిగిన పోలింగ్​ బూత్​లో రెండంటే రెండే ఓట్ల రావటమే నిదర్శనం.

ఈ నెల 25న పోలింగ్​ జరుగుతున్న సమయంలో కలియాగంజ్​ నియోజకవర్గం ఘియాఘాట్​ గ్రామంలోని 32, 33 నెంబరు పోలింగ్​ కేంద్రాలను సందర్శించేందుకు వచ్చారు భాజపా అభ్యర్థి జయ్​ ప్రకాశ్​ మజుందార్​. ఆ సమయంలో ఆయనపై దాడి జరిగింది. ఓ వ్యక్తి కాలితో తన్నగా మజుందార్ ముళ్లపొదల్లో పడిపోయారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. ఎన్నికల సంఘం దర్యాప్తుకు ఆదేశించింది.

ఆ ఘటన మినహా మూడు అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నేడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటించింది ఎన్నికల సంఘం. అయితే.. కలియాగంజ్​ స్థానంలో పోటీ చేస్తున్న భాజపా అభ్యర్థిపై దాడి జరిగిన 32వ పోలింగ్​ బూత్​లో ఆయనకు రెండే ఓట్లు వచ్చాయి. 33వ బూత్​లో 38 ఓట్లు వచ్చాయి.

కలియాగంజ్​లో భాజపా అభ్యర్థి జయ్​ప్రకాశ్​ మజుందార్​ పరాజయం పాలయ్యారు. ఆయనపై టీఎంసీ అభ్యర్థి సుమారు 2,418 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.

ఇదీ చూడండి: బంగాల్​ సెమీ ఫైనల్​లో దీదీ క్లీన్ స్వీప్​- భాజపాకు షాక్

Last Updated : Nov 28, 2019, 7:05 PM IST

ABOUT THE AUTHOR

...view details