తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నూతన విధుల కోసం జడ్జిల 2వేల కి.మీ రోడ్డు ప్రయాణం - judges travelling around twoo thousand kilometers

కరోనా వైరస్​ కారణంగా దేశవ్యాప్తంగా లాక్​డౌన్ కొనసాగుతోంది. విమానాలు, రైలు ప్రయాణాలు రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో గురువారం కొత్తగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పదోన్నతి పొందారు ఇద్దరు జడ్జిలు. త్వరలో బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. రవాణా సౌకర్యాలు లేని కారణంగా రెండు వేల కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గం ద్వారా ప్రయాణమయ్యారు.

judges
నూతన విధుల కోసం జడ్జిల 2వేల కి.మీ ప్రయాణం

By

Published : Apr 26, 2020, 1:08 PM IST

కరోనా లాక్​డౌన్​ సాధారణ పౌరులకే కాదు.. న్యాయమూర్తులకూ కష్టాలు తెచ్చిపెట్టింది. వైరస్ కారణంగా విమానాలు, రైలు ప్రయాణాలు రద్దు అయిన నేపథ్యంలో గురువారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా కొత్తగా నియమితులైన జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ విశ్వనాథ్ సోమద్దర్ రెండువేల కిలోమీటర్లు ప్రయాణించవలసి వస్తోంది.

సోమవారం మధ్యాహ్నం వరకు ప్రయాణమే

కోల్​కతా హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ దీపాంకర్ దత్తా.. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఇప్పటికే కుటుంబాన్ని ముంబయికి పంపించారు జస్టిస్ దత్తా. బాధ్యతల నుంచి వైదొలిగిన అనంతరం కుమారుడితో కలిసి కారులో ముంబయికి బయలుదేరారు. ఇందుకోసం ఆయన రెండు వేల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం తర్వాతే ఆయన ముంబయికి చేరుకునే అవకాశం ఉంది.

శుక్రవారం నుంచి..

అలహాబాద్​ హైకోర్టులో జడ్జిగా పనిచేసిన జస్టిస్ విశ్వనాథ్ సోమద్దర్.. మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. బాధ్యతలు చేపట్టేందుకు మేఘాలయ రాజధాని షిల్లాంగ్​కు రోడ్డు మార్గం ద్వారా శుక్రవారం సాయంత్రం బయలుదేరారు. నేటి మధ్యాహ్నం ఆయన అక్కడికి చేరుకుంటారు.

జస్టిస్ దత్తా, జస్టిస్ సోమద్దర్​ కోల్​కతా హైకోర్టు న్యాయమూర్తులుగా 2006 జూన్ 22న ఒకేసారి ఎంపికయ్యారు. అయితే తాజాగా ప్రధాన న్యాయమూర్తులుగా ఒకేసారి పదోన్నతి పొందడం, బాధ్యతలు చేపట్టేందుకు రెండువేల కిలోమీటర్లు ప్రయాణించాల్సి రావడం ఆసక్తికరం.

ఇదీ చూడండి:దేశంలో వైరస్​కు 'కొత్త రూపం'- వైద్యుల ఆందోళన

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details