తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనాను జయించిన నడ్డా- ఎయిమ్స్​ బృందానికి కృతజ్ఞతలు - ఎయిమ్స్ వైద్య బృందం

భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కరోనా నుంచి కోలుకున్నారు. తన కుటుంబ సభ్యులు సైతం మహమ్మారిని జయించారని ట్విట్టర్​లో ప్రకటించారు. తనకు చికిత్స అందించిన ఎయిమ్స్ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

JP Nadda recovers from COVID-19, expresses gratitude to AIIMS director
'కరోనాను జయించిన భాజపా జాతీయాధ్యక్షుడు'

By

Published : Jan 1, 2021, 10:55 PM IST

భాజపా జాతీయాధ్యక్షుడు జగత్​ ప్రకాశ్​ నడ్డా కరోనా నుంచి కోలుకున్నట్టు ప్రకటించారు. తన కుటుంబ సభ్యులు సైతం సురక్షితంగా ఉన్నారని తెలిపారు.

''నేను కరోనా నుంచి కోలుకోవాలని ప్రార్థించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నా. నేను, నా కుటుంబ సభ్యులం కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాం. ఎయిమ్స్ డైరెక్టర్​ డాక్టర్. రణదీప్​ గులేరియా, ఆయన బృందం చేసిన సేవలు మరువలేనివి.''

-నడ్డా ట్వీట్

పశ్చిమ్​ బంగా పర్యటన నుంచి తిరిగి వచ్చిన నడ్డా.. డిసెంబర్​ 13న పరీక్షలు చేయించుకోగా కరోనా ఉన్నట్లు తేలింది.

ఇదీ చదవండి:కొవిషీల్డ్​ అత్యవసర వినియోగానికి నిపుణుల కమిటీ సిఫార్సు

ABOUT THE AUTHOR

...view details