తెలంగాణ

telangana

By

Published : Mar 31, 2019, 5:44 PM IST

ETV Bharat / bharat

"నియంతలు కురువృద్ధులను అవమానించినందుకే.."

ప్రముఖ బాలీవుడ్​ నటుడు, భాజపా​ ఎంపీ శత్రుఘ్న సిన్హా కాంగ్రెస్​ పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో పట్నా సాహెబ్​ లోక్​సభ స్థానం నుంచే మరలా బరిలోకి దిగనున్నట్లు ఆయన ప్రకటించారు.

కాంగ్రెస్​లో చేరనన్నట్లు శత్రుఘ్న సిన్హా ప్రకటన

నటుడు, భాజపాఅసంతృప్తఎంపీ శత్రుఘ్న సిన్హా ఏప్రిల్​ 6న కాంగ్రెస్​ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్టు ప్రకటించారు. తన కుటుంబానికి సన్నిహితులైన లాలూ ప్రసాద్​ యాదవ్ సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారాయన.

"భాజపా నుంచి వైదొలగడం బాధాకరం. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్​షాలు నియంతల్లా వ్యవహరిస్తున్నారు. పార్టీ అభివృద్ధికి కృషిచేసిన ఆడ్వాణీ, మురళీ మనోహర్​ జోషి లాంటి కురువృద్ధ మహానాయకుల్ని అవమానించారు. వారి తీరు భరించలేకే నేను భాజపాను వీడుతున్నాను."

- శత్రుఘ్న సిన్హా, నటుడు, భాజపా అసంతృప్త ఎంపీ

మహాత్మా గాంధీ, వల్లభాయి పటేల్, జవహర్​లాల్​ నెహ్రూ లాంటి గొప్ప నాయకులు కాంగ్రెస్​ పార్టీకి ప్రాతినిధ్యం వహించారని శత్రుఘ్న గుర్తు చేశారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన కాంగ్రెస్​ పార్టీలో చేరనుండడం ఆనందంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

"రాహుల్​గాంధీ సమర్థుడైన నాయకుడు. రాజకీయ దార్శనికతతో ముందుకు సాగుతున్నారు. ప్రధాని అవ్వడానికి రాహుల్​కి అన్ని అర్హతలు ఉన్నాయి."

- శత్రుఘ్న సిన్హా, నటుడు, భాజపా అసంతృప్త ఎంపీ

తృణమూల్​ కాంగ్రెస్​ అధినేత్రి మమతా బెనర్జీ, సమాజ్​వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్​ యాదవ్​, ఆమ్​ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్​ అరవింద్​ కేజ్రీవాల్​ వారివారి పార్టీల్లో చేరమని తనను కోరారని శత్రుఘ్న సిన్హా తెలిపారు.

" ఈ సార్వత్రిక ఎన్నికల్లో నేను పట్నా సాహెబ్ లోక్​సభ స్థానం నుంచే పోటీ చేస్తా. 2014 లోక్​సభ ఎన్నికల్లో భాజపా పార్టీ అండ లేకుండానే అత్యధిక మెజారిటీతో గెలిచాను. ఈసారి ఆ రికార్డు​ను బద్దలుకొడతాను. ప్రచారానికి ఆడ్వాణీని గానీ, కూతురు సోనాక్షీ సిన్హాను గానీ పిలవను."

-శత్రుఘ్న సిన్హా, నటుడు, భాజపా అసంతృప్త ఎంపీ

పట్నా సాహెబ్​లో భాజపా తరఫున పోటీలో నిలుస్తున్న కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్​​ తమ కుటుంబానికి సన్నిహితులని, ఆయనపై తనకు గౌరవం ఉందని శత్రుఘ్న వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details