తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జేఎన్​యూ రగడ: 'గేట్ వే' నిరసనకారుల తరలింపు

ముంబయిలో జేఎన్​యూ విద్యార్థుల సంఘీభావ ఆందోళన కొనసాగుతోంది. గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద నిరసన చేపట్టిన ఆందోళనకారులను బలవంతంగా ఆజాద్ మైదానానికి తరలించారు అధికారులు. నిరసనకారులు రాత్రంతా ఆందోళన చేపట్టారు.

By

Published : Jan 7, 2020, 10:13 AM IST

Updated : Jan 7, 2020, 3:00 PM IST

mumbai
ముంబయిలో జేఎన్​యూ ఉద్యమకారుల ఆందోళన

జేఎన్​యూ రగడ: 'గేట్ వే' నిరసనకారుల తరలింపు

దిల్లీ జవహర్​లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థులపై దాడికి సంఘీభావంగా ముంబయి గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద నిరసన చేపడుతున్న వారిని ఆజాద్ మైదానానికి తరలించారు పోలీసులు. గేట్ వే ప్రాంతాన్ని వదిలి వెళ్లాలని పలుమార్లు హెచ్చరించినప్పటికీ నిరసనకారులు ఆ ప్రాంతాన్ని వీడని నేపథ్యంలో బలవంతంగా ఆజాద్​ మైదానానికి చేర్చారు. రాత్రంతా గేట్​వే, తాజ్ హోటల్ వద్ద గుమిగూడి నిరసనలు చేపట్టారు. బాలీవుడ్ నటులు అనురాగ్ కశ్యప్, స్వరా భాస్కర్, విశాల్ దడ్లానీ ఆందోళనలో పాల్గొన్నారు.

బాలీవుడ్ గీతాలతో

జేఎన్​యూ విద్యార్థులపై దాడికి నిరసనగా ఐఐటీ బాంబే, టీఐఎస్​ఎస్, ఏఎస్ఎఫ్​ఐ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ప్రధామంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్​షాకు వ్యతిరేకంగా విద్యార్థుల నినాదాలు హోరెత్తాయి. బాలీవుడ్ చిత్రాల్లోని గీతాలను తమ నినాదాలుగా మలుచుకున్నారు విద్యార్థులు.

కట్టుదిట్టమైన భద్రత

ఆందోళనలు ఉద్ధృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు.

ఇదీ చూడండి: మూడు వేల మంది ఒకేసారి సంగీతం ఆలపిస్తే..?

Last Updated : Jan 7, 2020, 3:00 PM IST

ABOUT THE AUTHOR

...view details