తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'జేఎన్​యూలో అల్లర్లు సృష్టించిన వారిని గుర్తించాం!' - జేఎన్​యూలో అల్లర్లు సృష్టించిన వారిని గుర్తించాం!

జేఎన్​యూలో ఈ నెల 5న దాడి జరిగిన సమయంలో వాట్సాప్ బృందాన్ని సృష్టించి అల్లర్లకు కారణమైన 37 మంది విద్యార్థులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అయితే వీరెవరికీ ఏ పార్టీలతోనూ సంబంధం లేదని స్పష్టం చేశారు. మరోవైపు దాడి జరిగిన సమయం కంటే ముందే విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఓ బృందం సంచరిస్తుండడంపై సమాచారం ఇచ్చినా... పోలీసులు సరిగా స్పందించలేదని జేఎన్​యూ విద్యార్ధి సంఘం ఆరోపించింది.

JNU violence
జేఎన్​యూలో అల్లర్లు సృష్టించిన వారిని గుర్తించాం

By

Published : Jan 12, 2020, 4:59 AM IST

Updated : Jan 12, 2020, 7:53 AM IST

జవహర్​లాల్​ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఈ నెల 5న దాడి, విధ్వంసం చోటుచేసుకున్న సమయంలో వాట్సాప్ బృందాన్ని సృష్టించి అల్లర్లకు కారణమైన 37 మంది విద్యార్థులను పోలీసులు గుర్తించారు. ఈ విద్యార్థులు ఎవరికీ వామపక్షాలతో సహా ఏ పార్టీకి సంబంధంలేదని వెల్లడించారు. యూనిటీ ఎగెనెస్ట్ లెఫ్ట్​ పేరుతో సృష్టించిన ఈ వాట్సాప్ బృందం తమ పరిశీలనలో ఉందని పోలీసులు తెలిపారు.

అనుమానితులు

వర్సిటీ విధ్వంసానికి కారణంగా జేఎన్​యూ విద్యార్ధి సంఘం అధ్యక్షురాలు అయిషే ఘోష్‌ సహా 9 మంది విద్యార్ధులను అనుమానితులుగా గుర్తించినట్లు దిల్లీ పోలీసులు ఇప్పటికే ప్రకటించారు.

పోలీసులు స్పందించలేదు

దాడి జరిగిన సమయం కంటే ముందే విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఓ బృందం సంచరిస్తుండడంపై ముందే సమాచారం ఇచ్చినా పోలీసులు సరిగా స్పందించలేదని జేఎన్​యూ విద్యార్ధి సంఘం ఆరోపించింది. దాడికి ఏబీవీపీ విద్యార్ధి సంఘం కారణమని ఆరోపించింది.

దర్యాప్తు చేయాలి

కాంగ్రెస్‌ కూడా ఈ జేఎన్​యూ ఘటనపై విమర్శలు గుప్పించింది. విశ్వవిద్యాలయ ఉప కులపతి జగదీశ్‌ కుమార్‌, దిల్లీ పోలీసు కమిషనర్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేసింది. దాడి ఘటనపై స్వతంత్ర సంస్ధతో దర్యాప్తు జరిపించాలని ఆ పార్టీ ప్రతినిధి రణ్​దీప్‌ సూర్జేవాలా డిమాండ్‌ చేశారు.

ఇదీ చూడండి:'చమురు ధరల పెరుగుదలపై ఆందోళన అవసరం లేదు'

Last Updated : Jan 12, 2020, 7:53 AM IST

For All Latest Updates

TAGGED:

JNU violence

ABOUT THE AUTHOR

...view details