విద్యార్థుల నిరవధిక ఆందోళనలతో దిల్లీ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం కార్యనిర్వాహక మండలి దిగొచ్చింది. పెంచిన వసతి గృహాల రుసుములను పాక్షికంగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఆర్థిక వెసులుబాటు కల్పించనున్నట్లు తెలిపింది.
హాస్టల్ ఫీజులను పాక్షికంగా తగ్గించినందున విద్యార్థులు ఆందోళనలు వీడి తరగతులకు హాజరుకావాలని విద్యాశాఖ కార్యదర్శి ట్వీట్ చేశారు.
భగ్గుమన్న విద్యార్థులు
ఇటీవల వసతి గృహాల ఫీజులు పెంచుతూ జేఎన్యూ కార్యనిర్వాహక మండలి నిర్ణయం తీసుకుంది. ఒక విద్యార్థి ఉండే హాస్టల్ గది అద్దెను రూ.20 నుంచి రూ.600కు, ఇద్దరు విద్యార్థులు ఉండే గదులకు రూ.10 నుంచి రూ.300లకు పెంచింది.