జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహణ తేదిని ప్రకటించారు మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్. ఆగస్టు 23న పరీక్ష ఉంటుందని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
ఆగస్టు 23న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష - ఆగస్టు 23న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష!
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష తేదిని ఖరారు చేసింది కేంద్రం. ఆగస్టు 23న పరీక్షను నిర్వహించనున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ వెల్లడించారు.
![ఆగస్టు 23న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష jee](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7102979-thumbnail-3x2-jee.jpg)
ఆగస్టు 23న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష!
షెడ్యూల్ ప్రకారం మే 17న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహించాలి. అయితే దేశంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో వాయిదా పడింది. జేఈఈ-మెయిన్స్ను జులై 18 నుంచి 23మధ్య నిర్వహించనున్నట్లు ఈనెల 5న ప్రకటించింది మానవ వనరుల శాఖ. తాజాగా అడ్వాన్స్డ్ పరీక్ష తేదీని ఖరారు చేసింది.
ఇదీ చూడండి:లాక్డౌన్ వేళ.. ప్రేయసి కోసం కాలినడకన 500 కి.మీ.!
TAGGED:
jee entrance