జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ)లో కొనసాగడంపై జనతా దళ్ యునైటెడ్ కీలక నిర్ణయం తీసుకుంది. భాజపాతో జాతీయ స్థాయిలో వేరు పడి.. పొత్తును బిహార్కు మాత్రమే పరిమితం చేయాలని నిర్ణయించింది. త్వరలో జరిగే జమ్ముకశ్మీర్, ఝార్ఖండ్, హరియాణా, దిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని తీర్మానించింది.
ఈ రోజు జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది జేడీయూ.
అప్పుడే మొదలు
కేంద్ర మంత్రివర్గ కూర్పు సమయంలోనే భాజపా-జేడీయూ మధ్య భేదాభిప్రాయాలు బయటపడ్డాయి. ఒక కేబినెట్ మంత్రి, ఒక స్వతంత్ర హోదా మంత్రి, ఒక సహాయ మంత్రి పదవులను కేటాయించాలని జేడీయూ కోరింది. ఇందుకు భాజపా నిరాకరించింది. కేబినెట్లో జేడీయూకు ఒక్క స్థానమే ఇస్తామని తేల్చిచెప్పింది. ఫలితంగా కేంద్ర మంత్రివర్గంలో చేరలేదు జేడీయూ.