తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​: ఉగ్రవాదుల గ్రనేడ్ దాడి- 10 మందికి గాయాలు - కశ్మీర్​లో గ్రెనేడ్​ దాడి

జమ్ముకశ్మీర్​లో గ్రనేడ్ దాడి

By

Published : Oct 5, 2019, 11:45 AM IST

Updated : Oct 5, 2019, 1:08 PM IST

11:38 October 05

జమ్ముకశ్మీర్​లో గ్రనేడ్ దాడి

జమ్ముకశ్మీర్​లో ముష్కరులు మరో దారుణానికి తెగబడ్డారు. అనంత్​నాగ్​ జిల్లాలో డిప్యూటీ కమిషనర్​ కార్యాలయం ఆవరణలో గ్రనేడ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 10 మందికి పైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 8 మంది పాదచారులు, ఓ పోలీస్, ఓ పాత్రికేయుడు ఉన్నారు.

అనంత్​ నాగ్​ జిల్లాలో అత్యంత పటిష్ఠ భద్రత ఉన్న ప్రాంతంలో తీవ్రవాదులు గ్రనేడ్ విసిరినట్లు అధికారులు వెల్లడించారు. నిర్దేశిత లక్ష్యాన్ని కాకుండా వేరే చోట అది పడినట్లు చెప్పారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. 

ఉగ్రవాదుల చర్యతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆ ప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు. ముష్కరుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
 

Last Updated : Oct 5, 2019, 1:08 PM IST

ABOUT THE AUTHOR

...view details