తెలంగాణ

telangana

అయోధ్య మసీదు రూపశిల్పిగా ప్రొఫెసర్ అక్తర్​​

By

Published : Sep 2, 2020, 1:07 PM IST

Updated : Sep 2, 2020, 4:23 PM IST

అయోధ్య ధన్నీపుర్​లో సున్నీ వక్ఫ్ బోర్డు నిర్మిస్తున్న మసీదుకు కన్సల్టెంట్ ఆర్కిటెక్ట్​గా జామియా మిల్లియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఎంపికయ్యారు. ఆర్కిటెక్చర్​ విభాగాధిపతిగా ఉన్న ఎస్​ఎం అక్తర్​.. విశ్వవిద్యాలయంలో పలు భవనాల నిర్మాణంలో అనుభవంతో పాటు దిల్లీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు.

masjid
ఎస్​ఎం అక్తర్​

అయోధ్య ధన్నీపుర్​లో నిర్మించే మసీదు రూపకర్తగా జామియా మిల్లియా విశ్వవిద్యాలయం ఆర్కిటెక్చర్​ విభాగాధిపతి ఎస్​ఎం అక్తర్ నియమితులయ్యారు. ఈ మసీదును ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ (ఐఐసీఎఫ్) ట్రస్ట్ నిర్మించనుంది.

ఈ ప్రాజెక్టులో తన విద్యార్థులు కూడా భాగస్వాములు అవుతారని అక్తర్ వెల్లడించారు.

"ప్రపంచవ్యాప్తంగా నా వద్ద అభ్యసించిన ఆర్కిటెక్టులు వెయ్యి మందికిపైగా ఉన్నారు. వాళ్లు నాతో కలిసి ఈ ప్రాజెక్టులో భాగమవుతారు. ప్రస్తుతం ఉన్న విద్యార్థులకు కూడా అవకాశం కల్పిస్తాం. ఇది వారికి గొప్ప అనుభవంగా ఉంటుంది."

- ప్రొఫెసర్ అక్తర్​, జామియా మిల్లియా విశ్వవిద్యాలయం

దిల్లీ ప్రభుత్వంతో కలిసి..

విశ్వవిద్యాలయంలోని కంప్యూటర్ సెంటర్, ఆసుపత్రి తదితర నిర్మాణాలకు అక్తర్​ ఆర్కిటెక్ట్​గా పనిచేశారు. కొన్ని స్థానిక ప్రాజెక్టుల్లోనూ దిల్లీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు. అయితే కరోనా నేపథ్యంలో ప్రస్తుతం అయోధ్యను సందర్శించే అవకాశం లేదని ఆయన అన్నారు. కానీ, ఇంతకుముందే ఆ ప్రాంతాన్ని సందర్శించానని చెప్పారు.

15 మంది సభ్యులతో ట్రస్ట్..

అయోధ్య తీర్పులో భాగంగా మసీదు నిర్మాణానికి స్థలం కేటాయించాలని ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ధన్నీపుర్​లోని 5 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్​ బోర్డుకు అందించింది యోగి ప్రభుత్వం. ఇక్కడ మసీదు నిర్మాణం కోసం 15 మంది సభ్యులతో ఐఐసీఎఫ్ ట్రస్ట్​ను ఏర్పాటు చేసింది బోర్డు.

మసీదుతో పాటు ఆసుపత్రి, ప్రజా గ్రంథాలయం, ఇండో-ఇస్లామిక్ వారసత్వ సంపద కేంద్రాన్ని నిర్మించనున్నట్లు ట్రస్ట్ వెల్లడించింది.

ఇదీ చూడండి:అయోధ్య వివాదం ఆరంభం నుంచి భూమిపూజ వరకు..

Last Updated : Sep 2, 2020, 4:23 PM IST

ABOUT THE AUTHOR

...view details