తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అప్పుడు కార్యదర్శి- ఇప్పుడు అదే శాఖకు మంత్రి

ఎన్డీఏ ప్రభుత్వ కేబినెట్​లో కీలకమైన విదేశీ వ్యవహారాలశాఖ మంత్రిగా జైశంకర్ బాధ్యతలు చేపట్టారు. దేశ రక్షణ, వాణిజ్య రంగాల్లో, అంతర్జాతీయ వేదికల్లో భారత్​ ప్రతిష్ఠను పెంపొందించాల్సిన కీలక సవాళ్లు ఆయన ముందున్నాయి.

By

Published : May 31, 2019, 5:08 PM IST

Updated : May 31, 2019, 5:28 PM IST

అప్పుడు కార్యదర్శి- ఇప్పుడు అదే శాఖకు మంత్రి

అప్పుడు కార్యదర్శి- ఇప్పుడు అదే శాఖకు మంత్రి

విదేశాంగ కార్యదర్శిగా సేవలందించిన జై శంకర్​... మోదీ మంత్రివర్గంలో కీలకమైన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా నియమితులయ్యారు. విదేశీ వ్యవహారాల నిపుణుడిగా ఆయనకు ఉన్న అనుభవం... ఆ శాఖ ముందున్న కీలక సవాళ్లను ఎదుర్కొనేందుకు ఉపకరిస్తుందన్నది భాజపా పెద్దల ఆలోచన.

చైనా, అమెరికా దౌత్య వ్యవహారాల్లో నిపుణుడైన జైశంకర్​... ప్రస్తుతం పార్లమెంటు సభ్యుడు కాదు.

ప్రథమ ప్రాధాన్యం..

జైశంకర్​ ఆధ్వర్యంలోని విదేశీ వ్యవహారాలశాఖ ప్రథమ ప్రాధాన్యంగా... విదేశాలతో వాణిజ్య, రక్షణ ఒప్పందాలను బలోపేతం చేసుకోవచ్చు. ముఖ్యంగా అమెరికా, రష్యా, చైనా, జపాన్, ఫ్రాన్స్​, ఐరోపా సమాఖ్యతోపాటు భారత ఇరుగుపొరుగు దేశాలతో వాణిజ్య, రక్షణ సంబంధాలను మెరుగుపరుచుకోవాల్సి ఉంది.

చైనాతో బంధం మెరుగుపరచడం జైశంకర్​కు ఓ సవాల్​. 2017లో డోక్లాం ఘటన తర్వాత ఇరుదేశాల సంబంధాలు దెబ్బతిన్నాయి. నాటి ప్రతిష్టంభనకు తెరదించడంలో జైశంకర్​ కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు పూర్తిస్థాయిలో మైత్రి పునరుద్ధరణ... ఆయన నైపుణ్యానికి పరీక్ష.

ఐక్యరాజ్యసమితిలో...

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, అణు సరఫరాదారుల బృందం(ఎన్​ఎస్​జీ)లో శాశ్వత సభ్యత్వం సాధించడం.. ఎన్డీఏ ప్రభుత్వం ముందున్న మరో కర్తవ్యం.
ముడిచమురు సమృద్ధిగాగల గల్ఫ్​, మధ్య ఆసియా దేశాలతో... భారత్​ సత్సంబంధాలు వృద్ధి చేసుకోవాల్సి అవసరం ఉంది. ఈ పనులను జైశంకర్​ సమర్థంగా నిర్వహిస్తారని భాజపా అధిష్ఠానం ఆశిస్తోంది.

జైశంకర్ ఘనతలు..

భారత ప్రధాన వ్యూహాత్మక విశ్లేషకుల్లో ఒకరైన జైశంకర్​... 'భారత్​-అమెరికా అణుఒప్పందం' సాకారం చేసిన జట్టులో కీలక సభ్యుడు. 2005 నుంచి సుదీర్ఘకాలంపాటు నానిన ఈ ఒప్పందం.. మన్మోహన్​సింగ్ హయాం(2007)లో సాకారమైంది.

విశేషాలు..

1977 బ్యాచ్​ ఐఎఫ్​ఎస్ అధికారి అయిన జైశంకర్​ చెక్​ రిపబ్లిక్​, అమెరికా, చైనాల్లో భారత రాయబారిగా పనిచేశారు. సింగపూర్​లో భారత హైకమిషనర్​గానూ పనిచేశారు. 2015లో విదేశాంగ కార్యదర్శిగా నియమితులయ్యారు. 2018లో పదవీ విరమణ చేశారు. అనంతరం 'టాటా సన్స్' అంతర్జాతీయ కార్పొరేట్​ వ్యవహారాల అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు.

దేశానికి విస్తృత సేవలందించిన జైశంకర్​ను ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది భారత ప్రభుత్వం.

ఇదీ చూడండి: ఎక్కడికైనా సైకిల్​పై వెళ్లే కేంద్ర మంత్రి!

Last Updated : May 31, 2019, 5:28 PM IST

ABOUT THE AUTHOR

...view details