తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శ్రీనగర్​ సచివాలయంపై జమ్ముకశ్మీర్​ జెండా తొలగింపు - రాష్ట్రం

శ్రీనగర్​ సచివాలయంపై  ఆదివారం జమ్ముకశ్మీర్​ రాష్ట్ర జెండాను తొలగించి.. కేవలం జతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అధికారులు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ పతాకాన్ని ఎగరవేస్తామని తెలిపారు. ఆర్టికల్​ 370 రద్దయిన మూడు వారాల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.

శ్రీనగర్​ సచివాలయంపై జమ్ముకశ్మీర్​ జెండా తొలగింపు

By

Published : Aug 25, 2019, 9:29 PM IST

Updated : Sep 28, 2019, 6:19 AM IST

శ్రీనగర్​ సచివాలయంపై ఇకనుంచి త్రివర్ణ పతాకం ఒక్కటే రెపరెపలాడనుంది. ఆదివారం జమ్ము కశ్మీర్​ జెండాను తొలగించిన అధికారులు.. కేవలం జాతీయ జెండాను మాత్రమే ఆవిష్కరించారు. 370 ఆర్టికల్​ రద్దయిన మూడు వారాల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఆర్టికల్​ 370 రద్దు ముందు వరకు జమ్ము కశ్మీర్​లో అధికారికంగా జాతీయ జెండాతో పాటు రాష్ట్రీయ జెండానూ ఎగరేసేవారు. రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి రద్దుతో తాజాగా ఆ జెండాను తొలగించారు. ఇకపై అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ కేవలం జాతీయ పతాకాన్నే ఎగరవేస్తామని అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి:గాంధీ-150: మహిళాభివృద్ధికి మహాత్ముడే తొలి సారథి

Last Updated : Sep 28, 2019, 6:19 AM IST

ABOUT THE AUTHOR

...view details