తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అయోధ్య తీర్పు అనంతరం కశ్మీర్​ భద్రతపై సమీక్ష - J-K police chief, Army commander discuss security situation post Ayodhya verdict

అయోధ్య తీర్పు నేపథ్యంలో కశ్మీర్​లో విధించిన ఆంక్షలను తాజాగా అధికారులు సడలించారు. తీర్పు అనంతరం కశ్మీర్​లోయ భద్రతపై పోలీస్ బాస్​ డిల్బగ్ సింగ్​ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆంక్షల సమయంలో ప్రజలంతా శాంతియుతంగా ఉన్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.

అయోధ్య తీర్పు అనంతరం కశ్మీర్​లో భద్రతపై సమీక్ష

By

Published : Nov 11, 2019, 7:27 AM IST

అయోధ్య తీర్పు అనంతరం కశ్మీర్​లో పరిస్థితులపై సమీక్షించడానికి ఆర్మీ నార్తన్ కమాండర్ జనరల్ రన్​బీర్​ సింగ్​తో భేటీ అయ్యారు జమ్ము కశ్మీర్​ డీజీపీ డిల్బగ్ సింగ్. కశ్మీర్​ వ్యాప్తంగా భద్రతపై ఇరువురు చర్చించారు. అయోధ్య తీర్పు నేపథ్యంలో.. ముందు జాగ్రత్తగా పెద్ద ఎత్తున భద్రత బలగాలను మోహరించిన అధికారులు.. క్షేత్రస్థాయిలో పరిస్థితిపై సమీక్షించారు.

అనంతరం రాంబన్​ను సందర్శించిన డిల్బగ్... జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిని పరిశీలించారు. రాంబన్ సీనియర్ సూపరింటెండెంట్ అధికారి అనిత శర్మ, జాతీయ రహదారుల అధికారి జోహర్​లతో సమావేశమయ్యారు. ఆర్టికల్-370 రద్దు, అయోధ్య తీర్పు తదనంతరం కశ్మీర్​లో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇటీవల కురిసిన వర్షాలు, వరదలకు దెబ్బతిన్న రహదారులను త్వరితగతిన బాగు చేయాలని అధికారులకు సూచించారు.

ఆంక్షలు తొలగించిన అధికారులు

సున్నితమైన రామజన్మభూమి - బాబ్రీమసీదు కేసు తీర్పు వెలువడే సందర్భంగా కశ్మీర్​లో విధించిన ఆంక్షలను తొలగించారు. ఆదివారం రాత్రి నుంచి ఆంక్షలను సడలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే సాధారణ భద్రతా దళాలు ఎప్పటిలాగే కశ్మీర్​లోని పలు ప్రాంతాల్లో పహారా కాస్తున్నట్లు జమ్ము కశ్మీర్ డివిజనల్ కమిషనర్ సంజీవ్ వర్మ తెలిపారు. రెండు రోజులుగా మూసి ఉన్న పాఠశాలలు, విద్యాలయాలు సోమవారం తెరుచుకోనున్నట్లు చెప్పారు. ఆంక్షలు విధించిన సమయంలో ప్రజలంతా శాంతియుతంగా ఉన్నందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు సంజీవ్.

ఇదీ చూడండి: జమ్ములో ఎన్​కౌంటర్​- ఉగ్రవాది హతం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details