తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహా' పోరులో రాజకీయ కుటుంబాల హవా - national news

మహారాష్ట్రలో తాజాగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో రాజకీయ నేపథ్య కుటుంబాల హవా కొనసాగింది. ఎన్నడూ లేనంతగా ప్రముఖ నాయకుల కుటుంబ సభ్యులు, బంధువులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.

maharastra

By

Published : Oct 27, 2019, 6:16 AM IST

ఇటీవల జరిగిన మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో రాజకీయ కుటుంబాలు సత్తా చాటాయి. ప్రముఖ నాయకుల కుటుంబ సభ్యులు, బంధువులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. పలుచోట్ల తండ్రీకొడుకులు, భార్యాభర్తల్లో ఒకరు ఎంపీగా ఉంటే మరొకరు ఎమ్మెల్యేగా గెలిచారు.

దేశ్​ముఖ్​ వారసులు

మహారాష్ట్ర మాజీ సీఎం విలాస్​రావ్​ దేశ్​ముఖ్​ కుమారులు అమిత్​ దేశ్​ముఖ్​, ధీరజ్​ దేశ్​ముఖ్​ ఇద్దరూ లాతూర్​ పట్టణం, లాతూర్​ గ్రామీణం నుంచి విజయదుందుభి మోగించారు.

పవార్ కుటుంబం

ఎన్సీపీ అధినేత శరద్​ పవార్​ అల్లుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్​ పవార్​ బారామతి నుంచి గెలుపొందారు. ఆయనకు తోడుగా శరద్​పవార్​ మనమడు రోహిత్ పవార్​ విధాన భవన్​కు వెళ్లారు. కర్జాత్​ జామ్​ఖేడ్​లో మంత్రి రామ్ శిందేను ఓడించారు రోహిత్.

అజిత్​ పవార్​ భార్య సునేత్ర అల్లుడు రాణా జగ్​జీత్​ సిన్హా పాటిల్.. భాజపా టికెట్​తో తుల్జాపుర్​ నుంచి గెలుపొందారు.

ఎన్సీపీ బంధుగణాలు

ఎన్సీపీ బంధుగణాల్లో ఒకరైన బాబన్ శిందే మాఢా స్థానాన్ని తిరిగి కైవసం చేసుకున్నారు. ఎన్సీపీ మద్దతుతో ఆయన సోదరుడు సంజయ్​ శిందే కర్మాలా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. ఎన్సీపీ సీనియర్​ నేత ఛగన్​ భుజ్​బల్​ నాసిక్​లోని యేవలా స్థానంలో తిరిగి గెలుపొందగా... ఆయన కుమారుడు పంకజ్​ మాత్రం నందగావ్​లో ఓటమి పాలయ్యారు.

ప్రత్యర్థులుగా..

పర్లిలో సిట్టింగ్​ ఎమ్మెల్యే, మంత్రి పంకజ్​ ముండేపై ఆయన బంధువు, ఎన్సీపీ నేత ధనంజయ్​ ముండే గెలుపొందారు. నిలంగాలో భాజపా మంత్రి శంభాజీ పాటిల్​ నిలాంగేకర్​.. ఆయన సమీప బంధువయిన కాంగ్రెస్ నేత అశోక్​ పాటిల్ నిలాంగేకర్​ను ఓడించారు. ఇలా చాలా నియోజకవర్గాల్లో బంధువులపైనే విజయం సాధించారు పలు నేతలు.

కొత్త తరం..

రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి కొత్త తరం నేతలు ఈ ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేశారు. ఎన్సీపీ సునీల్ తత్కరే కుమార్తె ఆదితి.. శ్రీవర్ధన్​ నుంచి గెలిచారు. కాంగ్రెస్ మాజీ నేత, ముఖ్యమంత్రి సుశీల్​ కుమార్ శిందే కుమార్తె ప్రణితి శిందే మధ్య సోలాపుర్​ స్థానాన్ని తిరిగి దక్కించుకున్నారు.

తండ్రీ కొడుకులు..

  • ఠాణే శివసేన నేత, మంత్రి ఏకనాథ్​ శిందే కోపరి పంచ్​పఖాడీ స్థానంలో గెలుపొందారు. ఆయన కుమారుడు శ్రీకాంత్​... కల్యాణ్​ నుంచి ఎంపీగా ఉన్నారు.
  • నితేశ్ రాణే(ఎమ్మెల్యే, కుమారుడు)- నారాయణ్​ రాణే(ఎంపీ, తండ్రి)
  • సంతోష్​ ధన్వే (ఎమ్మెల్యే, కుమారుడు)- కేంద్ర మంత్రి రావ్​సాహెబ్​ ధన్వే(ఎంపీ, తండ్రి)
  • సుజయ్​ వీఖే పాటిల్ (ఎంపీ, కుమారుడు)- రాధాకృష్ణ వీఖే పాటిల్ (ఎమ్మెల్యే, తండ్రి)

భార్యాభర్తలు..

  • రవి రాణా(ఎమ్మెల్యే, బద్నేరా) - నవనీత్​ రాణా(ఎంపీ, అహ్మద్​నగర్​)
  • సురేశ్ ధనోర్కర్​ (ఎంపీ)- ప్రతిభ(ఎమ్మెల్యే, వరోడా)

ABOUT THE AUTHOR

...view details