తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రాణానికి ప్రాణం అడ్డేసిన జవాన్లు- సలాం చేసిన కొండకోనలు - jawan carrying a lady on strecher in uttarakhandvideo

ఉత్తరాఖండ్‌లో ప్రాణాలు పణంగా పెట్టి ఓ మహిళను ఆసుపత్రికి తరలించారు ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీసులు. ఎత్తైన కొండ ప్రాంతంలో 40 కిలోమీటర్ల మేర రాళ్లు రప్పలు, సెలయేర్లు దాటి 15 గంటలపాటు ఆమెను మోశారు జవాన్లు. జవాన్ల సాహసానికి స్థానికులు సలాం చేశారు.

ITBP jawans travelled 40-km on foot for 15 hours carrying an injured woman
ప్రాణానికి ప్రాణం అడ్డేసిన జవాన్లు-సలాం చేసిన కొండకోనలు!

By

Published : Aug 23, 2020, 6:21 PM IST

ఉత్తరాఖండ్ పితోర్​గఢ్​ జిల్లా మారుమూల గ్రామం లాప్సాలో గాయపడ్డ ఓ మహిళను ఆస్పత్రికి తరలించేందుకు ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ జవాన్లు తీవ్రంగా శ్రమించారు. స్ట్రెచర్‌పై ఆమెను మోసుకుంటూ 40 కిలోమీటర్ల దూరం కాలినడకన పయనించారు.

కొండలు, వరద ప్రభావిత ప్రాంతాల మీదుగా 15 గంటల పాటు వారి ప్రయాణం సాగింది. లాప్సా నుంచి మున్సియారి వరకు ఎన్నో అడ్డంకులను అధిగమిస్తూ వారు పయనించారు. జవాన్ల సేవానిరతిని స్థానికులు కొనియాడారు.

ఇదీ చదవండి: గంజాయిపై నిషేధంతో భారత్​కు వేల కోట్లు నష్టం!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details