సామాజిక మాధ్యమ యూజర్ ప్రొఫైళ్లకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేయాలన్న పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అనుసంధానం చేసే అంశంపై త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.
మద్రాసు, బాంబే, మధ్యప్రదేశ్ హైకోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను సుప్రీం కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ ఫేస్బుక్ వ్యాజ్యం దాఖలు చేసింది. అయితే... ఆధార్ అనుసంధానం చేయాలా వద్దా అనే అంశం జోలికి వెళ్లమని, ఫేస్బుక్ బదిలీ పిటిషన్ను మాత్రమే విచారిస్తామని ధర్మాసనం స్పష్టంచేసింది.