క్రీడా స్ఫూర్తి తరహాలో ఇస్రో స్ఫూర్తితో దేశం ఉప్పొంగిపోతోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారని కొనియాడారు మోదీ. ప్రతికూలతను అంగీకరించేందుకు ఎవరూ సిద్ధంగా లేరన్నారు.
హరియాణా రోహ్తక్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు మోదీ. సెప్టెంబరు 7న ఉదయం 1:50 గంటలకు చంద్రయాన్-2 ల్యాండర్ విక్రమ్ ఆచూకీ కోల్పోయిన ఘటనను గుర్తుచేశారు. ఆ వంద సెకన్ల పాటు జరిగిన పరిణామాలు 125 కోట్ల మంది భారతీయుల స్వభావాన్ని ప్రతిబింబించాయని వ్యాఖ్యానించారు. దేశ ప్రజలందరినీ ఇస్రో ఏకం చేసిందని కొనియాడారు.