ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చించుకుంటున్న ప్రధాన అంశం.. చంద్రయాన్-2. విక్రమ్ ల్యాండర్ను గుర్తించినట్టు ఇస్రో ఆదివారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఒక్కసారిగా ఆశలు చిగురించాయి. ఇస్రో తదుపరి సమాచారం కోసం ఎదురుచూస్తున్నట్టు సామాజిక మాధ్యమాల్లో అనేక మంది తమ భావోద్వేగ సందేశాలను పంచుకున్నారు.
దేశభక్తి, ఆశ, ఆత్మగౌరవం వంటి అంశాలతో నెటిజన్లు విశేషంగా ట్వీట్లు చేశారు. దీంతో '#విక్రమ్ల్యాండర్ఫౌండ్' ట్రెండింగ్గా మారింది.
శనివారం తెల్లవారుజామున చందమామపై అడుగుపెట్టే క్రమంలో ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల దూరంలో విక్రమ్ ల్యాండర్కు.. ఇస్రో కేంద్రానికి సంబంధాలు తెగిపోయాయి. ఈ నేపథ్యంలో నిరాశకు గురైన శాస్త్రవేత్తలకు యావత్ భారతదేశం అండగా నిలిచింది. ఒక రోజు అనంతరం చంద్రుని ఉపరితలంపై ఉన్నవిక్రమ్ ల్యాండర్ ఆచూకీతెలిసినట్లు ఇస్రో ఛైర్మన్ కె. శివన్ తెలిపారు. అయితే తాము ప్రయత్నించినట్టు ల్యాండర్... జాబిల్లిపై మృదువుగా దిగి ఉండకపోవచ్చన్నారు.