తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నింగిలోకి దూసుకెళ్లిన జీ శాట్​-30 - భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)

ప్రతిష్ఠాత్మక జీశాట్​-30 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. 38 నిమిషాల అనంతరం అరియాన్​-5 వాహననౌక.. ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టినట్లు అధికారులు ట్వీట్​ చేశారు. ఈ సమాచార శాటిలైట్​ 15 ఏళ్ల పాటు సేవలందించనున్నట్లు వెల్లడించింది ఇస్రో.

(ISRO): Ariane-5 flight VA251 carrying GSAT30 and EUTELSAT KONNECT successfully liftoff.
నింగిలోకి దూసుకెళ్లిన జీ శాట్​-30

By

Published : Jan 17, 2020, 6:09 AM IST

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)...జీశాట్‌-30 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపింది. ఫ్రెంచ్ గ‌యానాలోని కౌరు అంత‌రిక్ష కేంద్రం నుంచి అరియాన్​-5 వాహకనౌక ఈ ఉపగ్రహాన్ని మోసుకెళ్లినట్లు ఇస్రో తెలిపింది. కొంత సమయం తర్వాత నౌక నుంచి విడిపోయిన శాటిలైట్​.. 38 నిమిషాలకు విజయవంతంగా తన కక్ష్యలోకి ప్రవేశించిందని అధికారులు ట్వీట్​ చేశారు. ఈ ప్రయోగం విజయవంతమైనట్లు ధ్రువీకరిస్తూ... అరియాన్​ స్పేస్​ సీఈఓ స్టెఫాన్​ ఇస్రాల్​ కూడా ట్వీట్​ చేశారు.

ఇన్​శాట్​-4కు ప్రత్యామ్నాయంగా...

సమాచార శాటిలైట్‌ అయిన జీశాట్-30 బ‌రువు సుమారు 3,357 కిలోలు. ఇన్‌శాట్‌-4ఏకు ప్రత్యామ్నాయంగా జీశాట్‌-30 ప‌నిచేయ‌నుంది.

ఇతర దేశాలకు సమాచారం...

భార‌త్‌తో పాటు అనుబంధ దేశాల‌కు ఈ ఉపగ్రహం ద్వారా కేయూ బ్యాండ్‌లో సిగ్నల్ అందిస్తారు. గ‌ల్ఫ్ దేశాల‌కు సీ బ్యాండ్ ద్వారా క‌వ‌రేజ్ ఇవ్వనున్నారు. ఆసియాలో కొన్ని దేశాల‌తో పాటు ఆస్ట్రేలియాకూ సీ బ్యాండ్ ద్వారా సేవ‌లు అందిస్తారు. ఈ ఉపగ్రహం 15 ఏళ్ల పాటు సేవలందించనున్నట్లు ఇస్రో తెలిపింది.

ఇదీ చదవండి: 'ఇందిర-కరీం' వ్యాఖ్యలపై వెనక్కి తగ్గిన రౌత్

ABOUT THE AUTHOR

...view details