తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఐఎన్​ఎక్స్​ కేసులో చిదంబరం అరెస్ట్ ఖాయమా?

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో కాంగ్రెస్​ నేత చిదంబరం ముందస్తు బెయిల్​ పిటిషన్​ను తోసిపుచ్చింది దిల్లీ హైకోర్టు. కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఐఎన్​ఎక్స్ మీడియాలో జరిగిన ఆర్థిక అవకతవకల్లో చిదంబరం హస్తమున్నట్లు సీబీఐ, ఈడీ అభియోగాలు ఉన్నాయి.

చిదంబరం

By

Published : Aug 20, 2019, 5:26 PM IST

Updated : Sep 27, 2019, 4:26 PM IST

కాంగ్రెస్​ సీనియర్​ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి దిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఐఎన్​ఎక్స్ మీడియా, ఎయిర్​సెల్-మ్యాక్సిస్​ కేసుల్లో ముందస్తు బెయిల్​ పిటిషన్​ను జస్టిస్​ సునీల్​ గౌర్​ నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించింది.

ఎయిర్​సెల్-మ్యాక్సిస్​ కేసుల్లో సీబీఐ, ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్లు రెండూ చిదంబరానికి వ్యతిరేకంగా కోర్టులో తమ వాదనను వినిపించాయి. సమగ్ర విచారణకు చిదంబరాన్ని అరెస్టు చేసేందుకు అనుమతించాలని కోరాయి.

చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు 2007లో ఐఎన్​ఎక్స్ మీడియాకు సంబంధించిన రూ.305 కోట్ల విదేశీ ఫండ్ల అవకతవకల్లో చిదంబరం హస్తమున్నట్లు అభియోగాలున్నాయి. ఈ కేసులో చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం సహా పలువురిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి.

సుప్రీం వద్దకు...

తాజా పరిస్థితుల నేపథ్యంలో దిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. సుప్రీం మెట్లు ఎక్కింది చిదంబరం తరఫు న్యాయవాదుల బృందం. కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ, సల్మాన్​ ఖుర్షీద్... సుప్రీంకోర్టు రిజిస్ట్రార్​ను కలిశారు. అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పించే అంశంపై బుధవారం ఉదయం 10.30గంటలకు విచారణ చేపట్టాలని కోరారు.

ఇదీ చూడండి: 'కీలక ఘట్టం పూర్తి- సెప్టెంబర్​ 7న ల్యాండింగ్​'

Last Updated : Sep 27, 2019, 4:26 PM IST

ABOUT THE AUTHOR

...view details