తెలంగాణ

telangana

ఐఎన్​ఎక్స్​: చిదంబరం నిర్బంధ విచారణ పొడిగింపు

By

Published : Sep 2, 2019, 8:04 PM IST

Updated : Sep 29, 2019, 5:07 AM IST

కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కస్టడీని మరో రోజు పొడిగిస్తూ దిల్లీ సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలిచ్చింది. చిదంబరం దాఖలు చేసిన మధ్యంతర బెయిల్​ పిటిషన్​పై మంగళవారం విచారణ జరపనుంది.

చిదంబరం

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం సీబీఐ కస్టడీని దిగువ కోర్టు మరోరోజు పొడిగించింది. నేటితో 3 రోజుల గడువు ముగిసిన నేపథ్యంలో చిదంబరంను దిల్లీ కోర్టు ముందు హాజరు పరిచారు సీబీఐ అధికారులు.

చిదంబరం అరెస్టును సవాలు చేస్తూ మధ్యంతర బెయిల్​ పిటిషన్​ను దాఖలు చేశారు ఆయన తరఫు న్యాయవాది కపిల్ సిబల్. ఈ కేసును ప్రత్యేకంగా చూడాల్సిన పనిలేదని సీబీఐ తరఫున సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా వాదనలు వినిపించారు.

"పౌరులందరినీ సమానంగా చూడాలి. వ్యక్తిగత స్వేచ్ఛ అందరికీ వర్తించాలి. ఈ కేసును ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఏముంది? నిర్బంధ విచారణను మరో రోజు పొడిగించాలి."

- తుషార్​ మెహతా, సొలిసిటర్​ జనరల్

ఈ కేసు ప్రత్యేకమైనందునే మెహతా వాదిస్తున్నారని చిదంబరం తరఫు మరో న్యాయవాది అభిషేక్​ మను సింఘ్వీ సమాధానమిచ్చారు. ఈ కేసులో చిదంబరానికి ఉపశమనం కల్పించేందుకు సీబీఐ అంగీకరించలేదు. విచారణ నిమిత్తం కస్టడీ పొడిగించాలని కోరింది. ఈ మేరకు మరో రోజు కస్టడీకి అనుమతిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్​ అజయ్​కుమార్​ కుహర్​ తీర్పునిచ్చారు.

అంతకుముందు మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ను పరిశీలించాలని సీబీఐ కోర్టుకు అత్యున్నత న్యాయస్థానం సూచించింది.

ఇదీ చూడండి: ఎయిర్​సెల్​ కేసులో చిదంబరం కస్టడీకి సీబీఐ, ఈడీ విజ్ఞప్తి

Last Updated : Sep 29, 2019, 5:07 AM IST

ABOUT THE AUTHOR

...view details