తెలంగాణ

telangana

By

Published : Jun 9, 2019, 7:43 PM IST

ETV Bharat / bharat

సుఖోయ్​ యుద్ధ విమానాల్లో బ్రహ్మోస్​

భారత అమ్ములపొదిలోని 40 సుఖోయ్​ యుద్ధ విమానాల్లోకి బ్రహ్మోస్​ క్షిపణులను అనుసంధానించే ప్రక్రియను వేగవంతం చేసింది ప్రభుత్వం. 2020 డిసెంబర్​లోపు ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యంగా పనులు చేపడుతోంది. బాలాకోట్​ వైమానిక దాడుల అనంతరం ఈ వ్యూహాత్మక ప్రాజెక్టును వేగిరం చేసింది.

సుఖోయ్​ యుద్ధ విమానాల్లో బ్రహ్మోస్​

ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు భారత ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. భారత వైమానిక దళాన్ని మరింత పటిష్ఠం చేసేందుకు చర్యలు వేగవంతం చేసింది. వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగా సుఖోయ్​ యుద్ధవిమానాల్లోకి బ్రహ్మోస్​ సూపర్​సోనిక్​ క్రూయిజ్​ క్షిపణులను అనుసంధానించే ప్రక్రియను వేగవంతం చేసింది. రక్షణ ప్రాజెక్టుల్లో భాగంగా 40 సుఖోయ్​ యుద్ధ విమానాలకు బ్రహ్మోస్​ క్షిపణులను అనుసంధానిస్తున్నారు.

పాకిస్థాన్​లోని బాలాకోట్​పై వైమానిక దాడుల అనంతరం సుమారు ఆరు వారాల తరువాత ఈ వ్యూహాత్మక కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

హిందుస్థాన్​ ఏరోస్పేస్​ లిమిటెడ్​ (హాల్​), బ్రహ్మోస్​ ఏరోస్పేస్​ ప్రైవేట్​ లిమిటెడ్​ (బీఏపీఎల్​)ల ఆధ్వర్యంలో ఇండో-రష్యా దేశాలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపడుతున్నాయి. 2020 డిసెంబర్ లోపు ప్రాజెక్టు పూర్తి చేయాలన్నది లక్ష్యం. గడువు ముగిసేలోపే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అధికారులు.

సుఖోయ్​ యుద్ధ విమానాలతో బ్రహ్మోస్​ క్షిపణుల అనుసంధానం జరిగితే వైమానిక దళ సామర్థ్యం పెరుగుతుంది. సముద్రంపైనా, భూమిపైనా సుదూర లక్ష్యాలను ఛేదించే బలం వైమానిక దళానికి చేకూరుతుంది.

2016లోనే నిర్ణయం

భారత్​ వద్దనున్న 40 సుఖోయ్​ యుద్ధ విమానాలతో బ్రహ్మోస్​ క్షిపణుల అనుసంధానానికి 2016లో బీజం పడింది. ప్రాజెక్టు 2017 చివర్లో ప్రారంభమైంది. కానీ ప్రాజెక్టు పనులు మందకొడిగా సాగాయని అధికార వర్గాలు తెలిపాయి.

ధ్వని వేగానికి మూడు రెట్లు

2.5 టన్నుల బరువుండే బ్రహ్మోస్​ క్షిపణి ధ్వని వేగానికి మూడు రెట్ల వేగంతో దూసుకెళుతుంది. 290 కిలోమీటర్ల సుదూర లక్ష్యాలను ఛేదించగలదు.

ఇదీ చూడండి:భారత్​లో 'మెడికల్​ డ్రోన్​' పరీక్ష సక్సెస్

ABOUT THE AUTHOR

...view details