తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వంతెన ప్రమాదంపై దర్యాప్తు

ముంబయిలో  పాదచారుల వంతెన కుప్పకూలిన ఘటనలో ఆరుగురు మృతిచెందారు. 31 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

By

Published : Mar 15, 2019, 12:52 PM IST

Updated : Mar 15, 2019, 4:20 PM IST

వంతెన ప్రమాదంపై దర్యాప్తు

వంతెన ప్రమాదంపై దర్యాప్తు
ముంబయిలోని ఛత్రపతి శివాజీ రైల్వేస్టేషన్​ సమీపంలోని ఓ పాదచారుల వంతెన కూలిన ఘటనలో ఆరుగురు మృతిచెందారు. 31 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో సమీపంలోని కూడలిలో రెడ్​ సిగ్నల్​ పడటం వల్ల భారీ ప్రమాదం తప్పింది.

మృతుల కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం రూ.5లక్షలు పరిహారం ప్రకటించింది. క్షతగాత్రులకు ఆర్థిక సాయంగా రూ.50వేలు ఇవ్వనుంది. చికిత్స ఖర్చులను ప్రభుత్వమే భరించనుంది.

ముఖ్యమంత్రి పరిశీలన

ఘటనా స్థలాన్ని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​ పరిశీలించారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. దర్యాప్తునకు ప్రత్యేక ఉన్నతాధికారుల కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ప్రమాదానికి సంబంధించి కేంద్ర రైల్వే శాఖ అధికారులు, బొంబాయి మున్సిపల్​ కార్పొరేషన్​ల​పై పోలీసులు కేసు నమోదు చేశారు.

టైమ్స్​ ఆఫ్​ ఇండియా భవంతి- ఛత్రపతి శివాజీ టర్మినల్ రైల్వే స్టేషన్​ను కలిపే ఈ వంతెనను 26/11 ముంబయి దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు వినియోగించారు. అందుకే ఈ వంతెనను 'కసబ్​ వంతెన' అని పిలుస్తారు.

40 ఏళ్ల క్రితం నిర్మించిన వంతెనను పరిశీలించాలని అధికారులను చాలా రోజుల నుంచే కోరుతున్నట్లు స్థానిక శివసేన కార్పొరేటర్​ సూజతా సనాప్ తెలిపారు. ఈ ఘటనపై ప్రధాని సహా పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ముంబయిలోని అంధేరిలో సరిగ్గా ఎనిమిది నెలల క్రితం ఇలాంటి ఘటనే జరిగింది. వంతెన కుప్పకూలిన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు.

Last Updated : Mar 15, 2019, 4:20 PM IST

ABOUT THE AUTHOR

...view details