తెలంగాణ

telangana

By

Published : Dec 11, 2019, 5:14 PM IST

ETV Bharat / bharat

ఆ రాష్ట్రానికి వెళ్లాలంటే ఇక అనుమతి తప్పనిసరి

వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య భారతంలో నిరసనలు మిన్నంటుతున్న వేళ... మణిపుర్​కు ఇన్నర్​లైన్​ పర్మిట్​ విధానాన్ని వర్తింపజేసింది కేంద్రం. ఐఎల్​పీ ఉన్న రాష్ట్రాల్లో బయటి వ్యక్తులు పర్యటించాలంటే తప్పనిసరిగా అనుమతి పొందాల్సిందే.

inner-line-permit-regime-extended-to-manipur-prez-signs-order
ఆ రాష్ట్రానికి వెళ్లాలంటే ఇక అనుమతి తప్పనిసరి

ఈశాన్య రాష్ట్రం మణిపుర్​కు ఇన్నర్​లైన్​ పర్మిట్​(ఐఎల్​పీ) విధానాన్ని వర్తింపజేస్తూ రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లు(సీఏబీ)పై ఈశాన్య భారతంలో నిరసనలు చెలరేగుతున్న తరుణంలో రాష్ట్రపతి నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

సీఏబీపై ఈశాన్య రాష్ట్రాల ప్రజలకున్న భయాన్ని తొలగిస్తూ.. మణిపుర్​కు ఇన్నర్​లైన్​ పర్మిట్​ను వర్తింపజేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా రెండు రోజుల క్రితం లోక్​సభ వేదికగా హామీనిచ్చారు. ఈ మేరకు నేడు రాష్ట్రపతి.. దస్త్రాలపై సంతకం చేశారు. సంబంధిత నోటిఫికేషన్​ను హోంశాఖకు విడుదల చేసింది.

దిమాపుర్​కూ...

నాగాలాండ్​లోని దిమాపుర్​ జిల్లాకు కూడా ఐఎల్​పీని వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుంది అక్కడి ప్రభుత్వం. 1963లో నాగాలాండ్​ రాష్ట్రంగా ఆవిర్భవించినప్పటి నుంచి దిమాపుర్​ జిల్లా ఒక్కటే ఐఎల్​పీ పరిధిలో లేదు.

ఏంటీ ఐఎల్​పీ?

ఐఎల్​పీ విధానం ఉన్న రాష్ట్రాల్లో పర్యటించాలంటే విదేశీయులు సహా స్వదేశంలో ఉండే ప్రజలు కూడా అనుమతి తీసుకోవాల్సిందే. ఐఎల్​పీతో అక్కడి స్థానికులకు భూమి, ఉద్యోగాలు ఇతర అంశాల్లో లబ్ధి, రక్షణ కలుగుతుంది. దేశంలోని ఇతర ప్రజలు ఈ ఐఎల్​పీ రాష్ట్రాల్లో స్థిరపడకుండా చేసి, అక్కడి స్థానికులకు రక్షణ కల్పించడమే ఈ ఐఎల్​పీ ముఖ్య ఉద్దేశం.

అరుణాచల్​ప్రదేశ్​, నాగాలాండ్​, మిజోరం​ తర్వాత.. ఈ ఐఎల్​పీ విధానం అమల్లోకి వచ్చిన నాలుగో రాష్ట్రం మణిపుర్​.

ఇదీ చూడండి:- అసోంలో పౌర బిల్లుకు వ్యతిరేకంగా మిన్నంటిన నిరసనలు

ABOUT THE AUTHOR

...view details