తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇన్ఫోసిస్​ సుధామూర్తి సింప్లిసిటీ చూశారా?

ఇన్ఫోసిస్​ ఫౌండేషన్​ ఛైర్​పర్సన్​ సుధామూర్తి మరోసారి తన ఉదారత, నిరాడంబరతను చాటుకున్నారు. వరద బాధితులకు సాయం చేసేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. సహాయ సామగ్రిని స్వహస్తాలతో సిద్ధం చేశారు.

By

Published : Aug 13, 2019, 4:15 PM IST

Updated : Sep 26, 2019, 9:15 PM IST

ఇన్ఫోసిస్​ సుధామూర్తి

కర్ణాటకలో వరద బాధితులకు సాయం అందించేందుకు ఇన్ఫోసిస్​ ఫౌండేషన్ ఛైర్​పర్సన్​ సుధా మూర్తి ముందుకొచ్చారు. బెంగళూరు జయనగర్​లోని ఆమె నివాసంలో స్వయంగా సహాయ సామగ్రిని పంపిణీ కోసం సిద్ధం చేశారు.

ఇన్ఫోసిస్​ సుధామూర్తి

వరదల కారణంగా నిరాశ్రయులైన వారికి ఇళ్లు కట్టించేందుకు నిర్ణయం తీసుకున్నారు సుధా మూర్తి. ఇందుకోసం ఇన్ఫోసిస్​ ఫౌండేషన్​ నుంచి రూ.10 కోట్లు కేటాయించనున్నారు.

ఇన్ఫోసిస్​ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి భార్య సుధామూర్తి... 1996లో 'ఇన్ఫోసిస్​ ఫౌండేషన్'​ స్థాపించారు. ఈ సంస్థ ద్వారా వరద బాధితులకు ఇప్పటివరకు 2,300 ఇళ్లు నిర్మించారు. విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత, పారిశుద్ధ్యం, సాంస్కృతిక రంగాల్లో అనేక కార్యక్రమాలు చేపట్టారు సుధా మూర్తి.

ఇదీ చూడండి: అరగంట సవాల్​ ఓడి.. 57 గంటలకు తిరిగొచ్చాడు!

Last Updated : Sep 26, 2019, 9:15 PM IST

ABOUT THE AUTHOR

...view details