70 కిలోల ఎండీఎంఏ(మిథైల్ ఎనిడియోక్సి మెథాంఫేటమిన్) డ్రగ్స్ సరఫరా కేసులో దొరికిన ఐదుగురు నిందితుల ఆస్తులపై ఈడీ దర్యాప్తు చేయాలని మధ్యప్రదేశ్ ఇందోర్ పోలీసులు కోరారు. ఈ డ్రగ్స్ సరఫరాలో మరికొందరి భాగస్వామ్యం ఉందని, త్వరలోనే వారిని పట్టుకుంటామని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరినారాయణ్ మిశ్రా తెలిపారు.
ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన హరినారాయణ్ మిశ్రా... నిందితుల అక్రమాస్తులను గుర్తించేలా ఈడీ సోదాలు చేయాల్సిందని అవసరం ఉందన్నారు.
"నిందితులు భారీగా ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు తెలుస్తోంది. ఐదుగురికి సంబంధించి కొన్ని అక్రమ ఆస్తులను గుర్తించే పనిలోనే ఉన్నాం. ఈ కేసుకు సంబంధించి మరికొంత మందిని అరెస్టు చేసే అవకాశాలున్నాయి".
-హరినారాయణ్ మిశ్రా, ఇందోర్ ఐజీపీ.