తెలంగాణ

telangana

విమానంలో ఒకరికి కరోనా.. ప్రయాణికులంతా క్వారంటైన్​​

By

Published : May 26, 2020, 12:46 PM IST

మే 25న ఇండిగో విమానంలో చెన్నై నుంచి కోయంబత్తూరుకు వెళ్లిన ఓ యువకుడికి కరోనా పాజిటివ్​గా తేలింది. దీనితో అప్రమత్తమైన అధికారులు అతడిని కొవిడ్ ఆసుపత్రికి తరలించారు. మిగతా ప్రయాణికులను క్వారంటైన్​కు తరలించారు. వారికి కూడా కొవిడ్ పరీక్షలు చేసే అవకాశమున్నట్లు తెలిపారు.

Indigo passenger tested positive for COVID
ఇండిగో విమాన ప్రయాణికుడికి కరోనా పాజిటివ్

చెన్నై నుంచి కోయంబత్తూరుకు సోమవారంవిమానయానం చేసిన ఓ ప్రయాణికుడికి కరోనా పాజిటివ్​గా తేలింది. దీనితో అప్రమత్తమైన అధికారులు బాధితుడిని కొవిడ్ ఆసుపత్రికి తరలించారు.

కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు, దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపేందుకుగాను కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చింది. ఇందులో భాగంగా సోమవారం నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి.

ప్రయాణం తరువాత...

ఓ 24 ఏళ్ల యువకుడు ఇండిగో 6ఈ 381 విమానంలో ... చెన్నై నుంచి కోయంబత్తూరుకు వెళ్లాడు. ప్రయాణ నిబంధనల్లో భాగంగా కరోనా పరీక్షలు చేసుకోగా... పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది.

అప్రమత్తమైన అధికారులు కరోనా బాధితుడిని హోటల్​ నుంచి ఈఎస్​ఐ ఆసుపత్రికి తరలించారు. తోటి ప్రయాణికులను క్వారంటైన్​కు తరలించారు. వారికి కూడా కరోనా పరీక్షలు చేసే అవకాశముందని తెలిపారు.

ఇదీ చూడండి:చౌక వెంటిలేటర్లు రూపొందించిన భారతీయ అమెరికన్​ జంట

ఇదీ చూడండి:600 మంది 'ఉబర్' ఉద్యోగులకు ఉద్వాసన

ABOUT THE AUTHOR

...view details