దేశంలో తొలి సీప్లేన్ సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. గుజరాత్లోని నర్మదా జిల్లాలో, సబర్మతి నదీ తీరం నుంచి సర్దార్ పటేల్(ఐక్యతా) విగ్రహం వరకూ ఈ సేవలు అందించనున్నారు. 19-సీట్లున్న 'ట్విన్ ఒట్టర్-300' సీప్లేన్ మాల్దీవులు లోని మాలే నుంచి భారత్కు ఆదివారం చేరింది. గుజరాత్లోని అహ్మదాబాద్కు ఇద్దరు విదేశీ పైలట్లతో సోమవారం చేరుకుంది.
అక్టోబర్ 31న సీప్లేన్ సేవల ప్రారంభం! - సబర్మతి తీరం
దేశంలో తొలి సీప్లేన్ సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. అక్టోబర్ 31న ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మాల్దీవుల నుంచి భారత్కు ఆదివారం చేరిన సీప్లేన్.. కెవాడియా మీదుగా అహ్మదాబాద్కు సోమవారం వచ్చింది. సబర్మతి తీరం నుంచి పటేల్ విగ్రహం వరకు రాకపోకలు సాగనున్నాయి.

అక్టోబర్ 31న సీప్లేన్ సేవల ప్రారంభం!
నీటి పైనుంచే ఎగిరి, నీటిపైనే దిగే ఈ విమానంలో 12 మంది ప్రయాణికులను అనుమతిస్తారు. సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఈనెల 31న సీప్లేన్ సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కేంద్ర నౌకా రవాణాశాఖ సహాయ మంత్రి మన్సుఖ్ మండావియా సోమవారం చెప్పారు.