తెలంగాణ

telangana

'మన శాస్త్రవేత్తలు అన్ని రంగాల్లో సత్తా చాటారు'

By

Published : Nov 2, 2020, 11:43 PM IST

భారతీయ శాస్త్రవేత్తలు సైన్స్​లోని అన్ని రంగాల్లో తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారని కేంద్ర మంత్రి హర్షవర్ధన్​ అన్నారు. కొత్త బెంచ్​మార్క్​లను సాధించటానికి కొవిడ్​-19 వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ అవిశ్రాంతంగా పనిచేశారని కితాబిచ్చారు. దేశీయ సైన్స్​ అండ్​ టెక్నాలజీ విభాగం స్వర్ణోత్సానికి గుర్తుగా ప్రత్యేక పోస్టల్​ కవర్​ను ఆవిష్కరించారు.

Vardhan
కేంద్ర మంత్రి హర్షవర్ధన్

భారతీయ శాస్త్రవేత్తలు అంతర్జాతీయంగా సైన్స్​లోని అన్ని రంగాల్లో తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారని పేర్కొన్నారు కేంద్ర శాస్త్రీయ, సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్​​. సైన్స్​లోని కృత్రిమ మేథ, నానో టెక్నాలజీ, అటామిక్​ క్లాక్​, డేటా అనలిటిక్స్​, ఆస్టో ఫిజిక్స్​ వంటి అన్ని రంగాల్లో వారు తమదైన ముద్ర వేశారని కొనియాడారు. వివిధ శాస్త్రీయ రంగాల్లో భారత్​కు అంతర్జాతీయంగా 80కిపైగా దేశాల సహకారం ఉందని చెప్పారు.

సైన్స్​ అండ్​ టెక్నాలజీ విభాగం స్వర్ణోత్సవానికి గుర్తుగా ప్రత్యేక పోస్టల్​ కవర్​ను ఆవిష్కరించారు హర్షవర్ధన్​. ఈ సందర్భంగా శాస్త్రవేత్తల సేవలను కొనియాడారు​.

" కొత్త బెంచ్​మార్క్​లను సాధించటానికి ప్రస్తుత కొవిడ్​-19 వంటి ప్రతికూల పరిస్థితులను సైతం లెక్కచేయక మన శాస్త్రవేత్తలు అవిశ్రాంతంగా పనిచేశారు."

- హర్షవర్ధన్​, కేంద్ర మంత్రి

ఈ సందర్భంగా మారుమూల గ్రామీణులకు రియల్​ టైమ్​లో సేవలందించేందుకు తపాలా శాఖతో సైన్స్​ అండ్​ టెక్నాలజీ విభాగం కలిసి పనిచేయాలని కోరారు తపాలా, విద్యా, ఎలక్ట్రానిక్స్​ అండ్​ ఐటీ శాఖ సహాయ మంత్రి సంజయ్​ ధోత్రే. సైన్స్​ అండ్​ టెక్నాలజీ విభాగం విజయాలను తెలిపే ప్రత్యేక పోస్టల్​ కవర్​ను ఆవిష్కరించటం చాలా సంతోషంగా ఉందన్నారు. భారత అభివృద్ధిలో సింహభాగం మన శాస్త్రవేత్తలదేనని కొనియాడారు.

సైన్స్​ అండ్​ టెక్నాలజీ విభాగాన్ని 1971, మే లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అది 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది.

ఇదీ చూడండి:రాజ్యసభ ప్యానళ్ల సమావేశ వ్యవధిలో మెరుగుదల!

ABOUT THE AUTHOR

...view details