భారత నావికా దళం మంగళవారం నుంచి రెండు రోజుల పాటు మెగా డ్రిల్ నిర్వహించనుంది. దేశంలో 7,516 కిలోమీటర్ల మేర సముద్ర తీరం, ప్రత్యేక ఆర్థిక జోన్లను కలిగి ఉన్న 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో విన్యాసాలు చేపట్టనుంది.
రెండు రోజుల పాటు భారత నావికా దళ విన్యాసాలు - Indian Navy
భారత నావికా దళం రెండు రోజుల పాటు విన్యాసాలు నిర్వహించనుంది. దేశంలోని తీర ప్రాంత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అభ్యాసాలు చేపట్టనుంది. సముద్ర తీర భద్రతలో ఎదురయ్యే సవాళ్లను గుర్తించేందుకు 'సీ విజిల్-21' పేరుతో మంగళవారం నుంచి ఈ విన్యాసాలు చేపడుతోంది.
![రెండు రోజుల పాటు భారత నావికా దళ విన్యాసాలు indian-navy-to-conduct-two-day-mega-drill-from-tuesday](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10208104-thumbnail-3x2-img.jpg)
రెండు రోజుల పాటు భారత నావికా దళ విన్యాసాలు
'సీ విజిల్-21' పేరుతో ఈ రక్షణ విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు నేవీ తెలిపింది. ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే ట్రోపెక్స్ విన్యాసాలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొంది. వీటి ద్వారా తీరప్రాంత భద్రతలో ఎదురయ్యే సవాళ్లను గుర్తించవచ్చని చెప్పింది.