తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మైనారిటీలపై దాడులు.. పాక్​పై భారత్ తీవ్ర ఆగ్రహం

పాకిస్థాన్​లోని మైనారిటీ హిందువులపై జరుగుతున్న దాడుల అంశమై భారత్​లోని ఆ దేశ హైకమిషనర్​ వద్ద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది భారత్. పాక్​లోని మత, సాంస్కృతిక మైనారిటీలపై వ్యవస్థీకృత దాడులు జరుగుతున్నాయని పేర్కొంది.

By

Published : Jun 10, 2020, 7:08 AM IST

indo pak
మైనారిటీలపై దాడులు.. పాక్ హైకమిషనర్​ వద్ద భారత్ అసంతృప్తి

పాకిస్థాన్​లోని మైనారిటీ హిందువుల ఇళ్లను కూల్చడంపై పాకిస్థాన్ హైకమిషనర్​ వద్ద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది భారత్. పాక్ పంజాబ్​ రాష్ట్రం యజ్మాన్ ప్రాంతంలోని ఇళ్లను.. నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని పేర్కొంటూ కూల్చేశారు పాక్ అధికారులు. ఇవి అక్కడ మైనారిటీలైన హిందువులవి. ఈ నేపథ్యంలో పాక్ విధానాన్ని తప్పుపట్టింది భారత్. పాక్​లోని మత, సాంస్కృతిక మైనారిటీలపై వ్యవస్థీకృత దాడులు జరుగుతున్నాయని భారత పౌర సమాజం ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించింది.

యాజమాన్య హక్కు పత్రాలు సరిగానే ఉన్నప్పటికీ, కూల్చివేత నిలిపేయాలంటూ ప్రభుత్వం నుంచి ఆదేశాలు తెచ్చినప్పటికీ.. రాష్ట్ర అధికారులు ఇవేవి పట్టించుకోకుండా ఇళ్ల కూల్చివేత చేపట్టారని పేర్కొంది. ఇది హిందువులను లక్ష్యంగా చేసుకోవడమేనని చెప్పుకొచ్చింది.

ఇదీ చూడండి:ఇస్రో నుంచి నింగిలోకి.. ఇక ప్రైవేటు రాకెట్లు

ABOUT THE AUTHOR

...view details