హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్, ఆస్రేలియా సంయుక్తంగా భారీ నావికా విన్యాసాలు నిర్వహించనున్నాయి. బుధవారం ప్రారంభమయ్యే ఈ విన్యాసాలు రెండు రోజుల పాటు కొనసాగనున్నాయి. ఇందులో సంక్లిష్ట నౌకాదళ విన్యాసాలతో పాటు విమాన నిరోదక డ్రిల్స్, హెలికాప్టర్ ఆపరేషన్లు ఉంటాయని అధికారులు తెలిపారు.
"సాంకేతిక సమాచార మార్పిడి, పరస్పర అవగాహన మెరుగుపరచటం, ఉత్తమ పద్ధతుల ప్రోత్సాహం ఈ విన్యాసాల లక్ష్యం. ఆయుధాల ఫైరింగ్, నౌకా అభ్యాసాలు, క్రాస్ డెక్ ఫ్లయింగ్ ఆపరేషన్లు, అధునాతన ఉపరితల, వాయు నిరోధక వ్యవస్థల విన్యాసాలు ఈ కార్యక్రమంలో భాగంగా ఉంటాయి. రెండు దేశాల మధ్య నౌకాదళ సంబంధాలు కొనసాగిస్తూ రక్షణ సంబంధాల బలోపేతానికి ఈ విన్యాసాలు దోహదపడుతాయి."
- నావికా దళ అధికార ప్రతినిధి