దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్నందున భారత సైన్యం అప్రమత్తమైంది. తమ అధీనంలో మరిన్ని నిర్భంద కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు సైనికాధికారులు వెల్లడించారు. ప్రస్తుతమున్న వాటితో పోలిస్తే.. అదనంగా మరో 1,500 మందికిపైగా వైద్యం సదుపాయం అందించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు స్పష్టం చేశారు.
అయితే.. ఈ నిర్బంధ కేంద్రాలను జైసల్మేర్, సూరత్ఘడ్, సికింద్రాబాద్, చెన్నై, కోల్కతా ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. మిలిటరీ ఆస్పత్రుల్లోనూ ప్రత్యేక వార్డుల ఏర్పాటు, స్క్రీనింగ్ చేసేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనున్నారు. స్థానిక వైద్య నిపుణుల సహకారంతో ఆర్మీ ఆస్పత్రుల వైద్యులు పని చేయనున్నారు.
జనవరిలో.. హరియాణాలోని మనేసర్లో ఓ నిర్బంధ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది సైన్యం. కరోనా అనుమానితులకు వైద్యం అందిస్తోంది.
పలు మార్గదర్శకాలు