తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాక్​కు భారత్​ దీటైన జవాబు.. ఆర్మీ పోస్టులు ధ్వంసం

నియంత్రణ రేఖ వెంబడి రాజౌరీ సెక్టార్​లో పాక్ ఆర్మీ పోస్టులను ధ్వంసం చేసినట్లు భారత భద్రతా దళాలు ప్రకటించాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘిస్తున్న దాయాది దేశానికి సరైన గుణపాఠం నేర్పినట్లు స్పష్టం చేశాయి.

By

Published : Jun 12, 2020, 9:44 AM IST

Indian Army causes heavy damage to Pakistan Army posts across LoC
ఎల్​ఓసీ వెంబడి పాక్​ ఆర్మీ పోస్టులకు భారీ నష్టం

కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ నియంత్రణ రేఖ (ఎల్​ఓసీ) వెంబడి పదేపదే కాల్పులకు పాల్పడుతున్న పాకిస్థాన్​కు దీటైన సమాధానం ఇచ్చినట్లు భారత భద్రతా దళాలు స్పష్టం చేశాయి. రాజౌరీ సెక్టార్​లో పాక్​ ఆర్మీ పోస్టులను కోలుకోలేని దెబ్బతీసినట్లు వెల్లడించాయి.

పాకిస్థాన్​ గత కొన్నేళ్లుగా నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడుతోంది. ముఖ్యంగా సరిహద్దు గ్రామాల ప్రజలను లక్ష్యంగా చేసుకుంటోంది. అయితే వీటిని భారత భద్రతా దళాలు సమర్థవంతంగా తిప్పికొడుతూనే ఉన్నాయి.

ఓ జవాన్ మృతి

బుధవారం రాత్రి 10 నుంచి 11 గంటల మధ్య... సరిహద్దుల్లో పలుచోట్ల పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. రాజౌరి, పూంఛ్ జిల్లాల్లోని నౌషెరా, బాలాకోట్ సెక్టార్లలోని నియంత్రణ రేఖ(ఎల్​ఓసీ) వెంబడి గ్రామాలు, సైనిక పోస్టులను లక్ష్యంగా చేసుకొని మోర్టార్లను ప్రయోగించారు.

ఈ ఘటనలో భారత జవాను మృతి చెందాడు. ఓ పౌరుడికి తీవ్ర గాయాలయ్యాయి. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. కొన్ని పశువులు కూడా మృతి చెందాయి.

కొద్దిరోజులుగా జమ్ముకశ్మీర్​లోని పలు ప్రాంతాల్లో నక్కి ఉన్న ఉగ్రవాదులను భారత సైన్యం హతమారుస్తుండగా పాక్ సైన్యం కాల్పులకు తెగబడుతుండడం గమనార్హం.

ఇదీ చూడండి:ప్రైవేటు ఉద్యోగుల వేతనాలపై నేడు సుప్రీం కీలక తీర్పు

ABOUT THE AUTHOR

...view details