తెలంగాణ

telangana

ETV Bharat / bharat

15 నుంచి 'వందే భారత్ మిషన్'​ రెండో దశ

విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే వందేభారత్​ మిషన్​ రెండో దశను ఈనెల 15 నుంచి ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. రెండో దశలో.. మద్య ఆసియా సహా ఐరోపా దేశాలైన రష్యా, జర్మనీ, స్పెయిన్​, థాయిలాండ్​ వంటి మరిన్ని దేశాలకు ఈ మిషన్​ను విస్తరించనున్నారు.

By

Published : May 8, 2020, 8:33 PM IST

Updated : May 8, 2020, 9:14 PM IST

Vande Bharat Mission
ఈనెల 15 నుంచి రెండో దశ 'వందే భారత్'​

కరోనా మహమ్మారి కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు చేపట్టిన వందేభారత్​ మిషన్​ను మరిన్ని దేశాలకు విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అందులో కజకిస్థాన్​​, ఉజ్బెకిస్థాన్​, రష్యా, జర్మనీ, స్పెయిన్​, థాయిలాండ్​ వంటి దేశాలు ఉన్నట్లు చెప్పారు.

మధ్య ఆసియా సహా ఐరోపా దేశాల్లో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు రెండో దశ వందే భారత్​ మిషన్​ను ఈనెల 15 నుంచి ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.

తొలి దశలో 12 దేశాలు..

తొలి దశ వందే భారత్​ మిషన్​లో భాగంగా 12 దేశాల నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకొస్తోంది కేంద్రం. ఈనెల 15 వరకు 64 విమానాల్లో సుమారు 15వేల మందిని దేశవ్యాప్తంగా ఉన్న 14 విమానాశ్రయాలకు చేర్చనుంది.

Last Updated : May 8, 2020, 9:14 PM IST

ABOUT THE AUTHOR

...view details