తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వాయుసేనలోకి మరో 200 యుద్ధ విమానాలు! - 'వైమానిక' పొదిలోకి మరో 2వందల యుద్ధ విమానాలు!

భారత వైమానిక దళంలోకి మరో 200 యుద్ధ విమానాలను సమకూర్చే దిశగా అడుగులు వేస్తోంది కేంద్రం. ఈ మేరకు దేశీయ విమాన తయారీ సంస్థ హెచ్​ఏఎల్​ నుంచి 83 ఫైటర్​ జెట్లను కొనుగోలు చేసేందుకు ఒప్పంద ప్రక్రియ తుది దశలో ఉన్నట్లు రక్షణశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. మరో 110 విమానాల కొనుగోలుకు ప్రకటన విడుదల చేసినట్లు చెప్పారు.

రఫేల్​
రఫేల్​

By

Published : Jan 12, 2020, 7:49 PM IST

Updated : Jan 12, 2020, 8:10 PM IST

వాయుసేనలో కాలం చెల్లిపోతున్న యుద్ధ విమానాల స్థానే మరో 200 ఫైటర్​ జెట్లను సమకూర్చుకునేందుకు యోచిస్తోంది కేంద్రం. ఈ మేరకు రక్షణ కార్యదర్శి అజయ్​ కుమార్ ప్రకటన విడుదల చేశారు. దేశీయ విమాన తయారీ సంస్థ హెచ్​ఏఎల్​తో 83 తేజస్​ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం తుదిదశలో ఉందని వెల్లడించారు. వాటితో పాటు మరో 110 విమానాల కొనుగోలుకు ప్రకటన విడుదల చేసినట్లు తెలిపారు.

"మొత్తంగా 200 యుద్ధ విమానాల కొనుగోలు ప్రక్రియ ఆయా దశల్లో ఉంది. హెచ్​ఏఎల్​ నుంచి తేజస్​ మార్క్​ 1 లైట్ కంబాట్ విమానాలను కొనేందుకు ఒప్పంద ప్రక్రియ తుది దశలో ఉంది. ఇవి భారత తక్షణ అవసరాలను తీరుస్తాయి."

-అజయ్​కుమార్, రక్షణ కార్యదర్శి

యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందాలు రానున్న రోజుల్లో పూర్తవుతాయని పేర్కొన్నారు అజయ్​కుమార్. సాధ్యమైనంత త్వరలో వైమానిక దళంలో యుద్ధవిమానాలు చేరే అవకాశం ఉందని చెప్పారు. అయితే హెచ్​ఏఎల్​కు ఏటా 8 నుంచి 16 యుద్ధ విమానాలు మాత్రమే తయారుచేసే సామర్థ్యం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అవసరమైతే ఔట్​ సోర్సింగ్ విధానం ద్వారా హెచ్​ఏఎల్​ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే దిశగా కృషి చేస్తామన్నారు.

ప్రస్తుతం వాయుదళంలో ఇవే

వైమానిక దళంలో ప్రస్తుతం సుఖోయ్ 30 ఎంకేఐ, మిరాజ్ 2000, మిగ్-29, మిగ్-21 బైసన్ వంటి యుద్ధ విమానాలు ఉన్నాయి. 2019 డిసెంబర్ 27న కార్గిల్ యుద్ధంలో సామర్థ్యం కనబరిచిన మిగ్-27 విమానాలను ఉపసంహరించారు.

ఇదీ చూడండి: 'కొంతమంది వామపక్ష విద్యార్థులతో విద్యా వ్యవస్థకు దెబ్బ'

Last Updated : Jan 12, 2020, 8:10 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details