తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లలిత్​ మోదీ దంపతులకు 'స్విస్​ నోటీసులు'

అక్రమ నగదు చలామణి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎల్​ మాజీ కమిషనర్​ లలిత్​ మోదీ, ఆయన భార్య మినాల్​కు స్విస్​ పన్నుల విభాగం ఎఫ్​టీఏ నోటీసులు జారీచేసింది. హవాలా మోసాలకు పాల్పడి దేశం నుంచి పారిపోయిన లలిత్ వివరాలు అందించాలని భారత్ చేసిన విజ్ఞప్తి మేరకు స్విట్జర్లాండ్ ఈ చర్యలు తీసుకుంది.

By

Published : Oct 2, 2019, 4:41 PM IST

Updated : Oct 2, 2019, 9:44 PM IST

లలిత్​ మోదీ దంపతులకు 'స్విస్​ నోటీసులు'

లలిత్​ మోదీ దంపతులకు 'స్విస్​ నోటీసులు'

హవాలా మోసాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన ఐపీఎల్​ మాజీ కమిషనర్​ లలిత్​మోదీ, ఆయన భార్య మినాల్​కు చెందిన బ్యాంకు ఖాతాల వివరాలు అందజేయాలని భారత్​.. స్విట్జర్లాండ్​ను కోరింది. భారత్ విజ్ఞప్తి మేరకు స్విస్​ పన్నుల విభాగం ఎఫ్​టీఏ... లలిత్​మోదీ దంపతులకు తాఖీదులు జారీ చేసింది. భారత్​ విజ్ఞప్తిపై 10 రోజుల్లో సమాధానం చెప్పాలని లలిత్​ మోదీ దంపతులను ఆదేశించింది.

అక్రమ నగదు లావాదేవీల విషయంలో సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలని భారత్, స్విట్జర్లాండ్ ఓ ద్వైపాక్షిక ఒప్పందం చేసుకున్నాయి. అందులో భాగంగానే స్విస్ తాజా చర్యలు తీసుకుంది.

లలిత్​మోదీ 2010లో భారత్​ నుంచి తప్పించుకుని లండన్​కు పారిపోయారు. భారత్​ విజ్ఞప్తి మేరకు 2016లోనూ లలిత్​మోదీకి స్విట్జర్లాండ్​ ఇలాంటి నోటీసులే జారీ చేసింది. అయితే లలిత్ ఇచ్చిన సమాచారాన్ని స్విస్​.. భారత్​కు అందజేసిందా లేదా అన్నది నిర్ధరణ కాలేదు.

ఇటీవల కాలంలో అక్రమ నగదు చలామణి ఆరోపణలు ఎదుర్కొంటున్న మరికొందరు భారతీయులకు కూడా ఎఫ్​టీఏ నోటీసులు జారీ చేసింది స్విస్ ప్రభుత్వం.

ఇదీ చూడండి:మేజిక్​ మెసేజ్​... వాట్సాప్​లో మరో అద్భుత ఫీచర్

Last Updated : Oct 2, 2019, 9:44 PM IST

ABOUT THE AUTHOR

...view details