తెలంగాణ

telangana

By

Published : Oct 17, 2020, 9:47 AM IST

Updated : Oct 17, 2020, 10:31 AM IST

ETV Bharat / bharat

దేశంలో 62 వేల కొత్త కేసులు.. 837 మరణాలు

దేశంలో మొత్తం కరోనా కేసులు 74 లక్షల 32 వేలు దాటాయి. ఒక్కరోజే 62 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్తగా 65వేల మంది కోలుకోవడం వల్ల రికవరీ రేటు 87.78శాతానికి చేరింది.

India reports a spike of 62,212 new #COVID19 cases & 837 deaths in the last 24 hours.
దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు

దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా 62,212 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 837మంది ప్రాణాలు కోల్పోయారు.

దేశంలో కేసుల వివరాలు

అయితే ఒక్కరోజులో 65,24,595మంది కరోనాను జయించారు. దీంతో రికవరీ రేటు 87.78శాతానికి చేరింది. వరుసగా తొమ్మిదో రోజు యాక్టివ్​ కేసుల సంఖ్య 9లక్షల దిగువన ఉండటం సానుకూల అంశం.

రాష్ట్రాలవారీగా కేసుల వివరాలు

పరీక్షలు...

శుక్రవారం.. 9,99,099 పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్​ వెల్లడించింది. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 9,32,54,017కు చేరింది.

ఇదీ చూడండి:-భారత్​లో కనిష్ఠానికి కరోనా మరణాల రేటు​

Last Updated : Oct 17, 2020, 10:31 AM IST

ABOUT THE AUTHOR

...view details