తెలంగాణ

telangana

By

Published : Feb 2, 2021, 10:00 AM IST

ETV Bharat / bharat

దేశంలో కొత్తగా 8,635 కరోనా కేసులు

దేశవ్యాప్తంగా కొత్తగా 8,635 కేసులు నమోదయ్యాయి. మరో 94 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య కోటి ఏడు లక్షల 66 వేల 245కి చేరగా... మరణాల సంఖ్య లక్షా 54 వేల 486కి పెరిగింది.

India cases
కరోనా కేసులు భారత్

దేశంలో కరోనా కేసుల్లో తగ్గుదల కొనసాగుతోంది. కొత్తగా 8,635 కేసులు వెలుగులోకి వచ్చాయి. అదేసమయంలో వైరస్ బారినపడి 94 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • మొత్తం కేసులు: 1,07,66,245
  • యాక్టివ్ కేసులు: 1,63,353
  • కోలుకున్నవారు: 1,04,48,406
  • మొత్తం మరణాలు: 1,54,486

కరోనా సోకిన వారిలో మరో 13,423 మంది కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో రికవరీ రేటు 97.05 శాతానికి పెరిగింది. మరణాల రేటు స్థిరంగా 1.43 శాతానికి తగ్గింది.

టెస్టుల సంఖ్య

ఫిబ్రవరి 1 దేశవ్యాప్తంగా 6,59,422 నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్​) తెలిపింది. దీంతో మొత్తం టెస్టు​ల సంఖ్య 19కోట్ల 77లక్షల 52 వేలకు పెరిగింది.

ABOUT THE AUTHOR

...view details