తెలంగాణ

telangana

దేశంలో కొత్తగా 18,222 కేసులు-228 మరణాలు

By

Published : Jan 9, 2021, 10:13 AM IST

దేశవ్యాప్తంగా కొత్తగా 18,222 మంది కరోనా బారిన పడ్డారు. మరో 228 మంది వైరస్​తో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 19వేల మందికిపైగా మహమ్మారిని జయించగా.. రికవరీ రేటు 96.39శాతానికి చేరింది.

India reports 18,222 new COVID-19 cases, 19,253 discharges, and 228 deaths in last 24 hours, as per Union Health Ministry
మరోసారి 19వేల దిగువకు కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు ఇరవై వేల దిగువకు నమోదైయ్యాయి. తాజాగా 18,222 మందికి కొవిడ్ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మొత్తం బాధితుల సంఖ్య 1 కోటి 4లక్షల 31వేల 639కు పెరిగింది. వైరస్​ ధాటికి మరో 228 మంది బలవ్వగా.. మృతుల సంఖ్య 1లక్షా 50వేల 798కి చేరింది.

రికవరీ రేటు ఇలా..

తాజాగా 19వేల మందికిపైగా వైరస్​ నుంచి కోలుకున్నారు. ఫలితంగా కరోనాను జయించిన వారి సంఖ్య 1కోటి 56వేల 651కి చేరింది. 2లక్షల 24వేల 190యాక్టివ్​ కేసులున్నాయి. దేశవ్యాప్త రికవరీ రేటు 96.39 శాతానికి ఎగబాకింది. మరణాల రేటు స్థిరంగా 1.45 శాతంగా నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇదీ చూడండి: దేశంలో 82కు చేరిన కొత్త కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details