తెలంగాణ

telangana

దేశంలో కొత్తగా 13,788 మందికి కరోనా

By

Published : Jan 18, 2021, 9:45 AM IST

దేశవ్యాప్తంగా కొత్తగా 13,788 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి మరో 145 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య కోటి 5 లక్షల 70 వేలు దాటింది.

india reported 13,788 new corona cases
దేశంలో కొత్తగా 13,788 మందికి కరోనా

దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. 15వేలలోపే కొత్త కేసులు నమోదవుతుండటం ఊరట కలిగించే విషయం. దేశవ్యాప్తంగా కొత్తగా 13,788 కరోనా కేసులు వెలుగుచూశాయి. మరో 145 మంది ప్రాణాలు కోల్పోయారు. 14,457 మంది వైరస్​ నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.

  • మొత్తం కేసులు: 1,05,71,773
  • క్రియాశీల కేసులు: 2,08,012
  • కోలుకున్నవారు: 1,02,11,342
  • మరణాలు: 1,52,419

ABOUT THE AUTHOR

...view details