తెలంగాణ

telangana

By

Published : Feb 17, 2020, 6:16 AM IST

Updated : Mar 1, 2020, 2:11 PM IST

ETV Bharat / bharat

'కశ్మీర్​పై గుటెరస్​ మధ్యవర్తిత్వం అవసరం లేదు'

కశ్మీర్​ సమస్య పరిష్కారానికి భారత్​, పాకిస్థాన్​లు అంగీకరస్తే మధ్యవర్తిత్వం చేసేందుకు సిద్ధమని ప్రకటించిన ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెరస్​ ప్రతిపాదనను భారత్​ తిరస్కరించింది. కశ్మీర్​ సమస్య పూర్తిగా ద్వైపాక్షిక అంశమేనని.. మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదని స్పష్టం చేసింది.

India rejects UN chief's offer to mediate on Kashmir issue
'కశ్మీర్​పై గుటెరస్​ మధ్యవర్తిత్వం అవసరం లేదు'

'కశ్మీర్​పై గుటెరస్​ మధ్యవర్తిత్వం అవసరం లేదు'

కశ్మీర్​ సమస్యపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్​ చేసిన 'మధ్యవర్తిత్వం' ప్రతిపాదనను భారత్​ తిరస్కరించింది. పాకిస్థాన్​ అక్రమంగా, బలవంతంగా ఆక్రమించుకున్న భూభాగాన్ని ఖాళీ చేయించడంపై దృష్టి సారించాలని స్పష్టం చేసింది.

పాకిస్థాన్​ పర్యటనలో ఉన్న గుటెరస్​... కశ్మీర్​లో పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. భారత్​, పాక్​ల మధ్య దీర్ఘకాలంగా ఉన్న సమస్యను పరిష్కరించే విధంగా మధ్యవర్తిత్వం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు​.

గుటెరస్​ వ్యాఖ్యలపై స్పందించిన విదేశాంగశాఖ ప్రతినిధి రవీశ్​ కుమార్..​. జమ్ముకశ్మీర్​ ఎప్పటికీ భారత దేశ అంతర్గత భాగమేనని స్పష్టం చేశారు.

"ఈ విషయం(కశ్మీర్​)లో భారత వైఖరి మారదు. జమ్ముకశ్మీర్​ ఇప్పుడు.. ఎప్పుడు భారత అంతర్భాగమే. పరిష్కరించాల్సిన సమస్య ఏదైనా ఉందంటే.. అది పాకిస్థాన్​ అక్రమంగా, బలవంతంగా ఆక్రమించుకున్న భూభాగాన్ని ఖాళీ చేయించడమే. ఇంకా ఏమైన సమస్యలు ఉంటే ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకుంటాం. కశ్మీర్​ అంశంలో మూడో వ్యక్తి మధ్యవర్తిత్వం వహించే అవసరం లేదు."

- రవీశ్​ కుమార్​, విదేశాంగ శాఖ ప్రతినిధి.

పాక్​లో నాలుగు రోజుల పర్యటన..

నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ప్రస్తుతం పాకిస్థాన్​లో ఉన్నారు ఆంటోనియో గుటెరస్​. ఇస్లామాబాద్​లో ఆ దేశ విదేశాంగ మంత్రి మహమ్మూద్​ ఖురేషీతో సమావేశమైన సందర్భంగా కశ్మీర్​ అంశాన్ని ప్రస్తావించారు గుటెరస్​.

ఇదీ చూడండి: 'క్రూయిజ్​షిప్'​లో మరో ఇద్దరు భారతీయులకు కరోనా

Last Updated : Mar 1, 2020, 2:11 PM IST

ABOUT THE AUTHOR

...view details