ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో కరోనా కలకలం-ఒక్కరోజులో 179 కేసులు - కరోనావైరస్ చికిత్స

దేశంలో కరోనా కోరలు విప్పుతోంది. ఒక్కరోజులో అత్యధికంగా 179 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 918 కి చేరుకున్నాయి. ఇప్పటివరకు 19 మంది వైరస్ సోకి ప్రాణాలు విడిచారు. మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదు కాగా.. కేరళ, తెలంగాణ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

corona
కరోనా
author img

By

Published : Mar 28, 2020, 10:02 PM IST

Updated : Mar 28, 2020, 10:43 PM IST

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. శనివారం కొత్తగా 179 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఒక్కరోజు నమోదైన కేసులలో ఇదే అత్యధికం. దీంతో మొత్తం కేసుల సంఖ్య 918కి చేరింది. ఇందులో 47 మంది విదేశీయులు ఉన్నట్లు స్పష్టం చేసింది కేంద్రం.

దేశంలో కరోనా ధాటికి 19 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వైద్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మహారాష్ట్రలో అత్యధికంగా 5, గుజరాత్​లో 3, కర్ణాటకలో 2, మధ్యప్రదేశ్​లో 2, తమిళనాడు, బిహార్, పంజాబ్, దిల్లీ, పశ్చిమ బంగాల్, జమ్ము కశ్మీర్, హిమాచల్​ ప్రదేశ్​లలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

కేసుల సంఖ్యలోనూ మహారాష్ట్ర ముందంజలో ఉంది. అత్యధికంగా ఈ రాష్ట్రంలో 180 కరోనా బాధితులను గుర్తించగా.. ఆ తర్వాతి స్థానాల్లో కేరళ 176, తెలంగాణ(65), కర్ణాటక(55), ఉత్తర్​ప్రదేశ్(55), రాజస్థాన్​(54) రాష్ట్రాలు ఉన్నాయి.

in article image
దేశవ్యాప్తంగా కేసుల వివరాలు

ఇదీ చదవండి:గర్భిణిని అడ్డుకున్న పోలీసులు-అంబులెన్సులోనే ప్రసవం

Last Updated : Mar 28, 2020, 10:43 PM IST

ABOUT THE AUTHOR

...view details