భారత్తో పాటు ఇతర దేశాలు.. వుహాన్ సహా చైనాలోని తమ పౌరులను స్వదేశానికి తరలించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. చైనాలో 23 వేలకుపైగా భారతీయ విద్యార్థులు ఉండగా వారిలో 21వేల మంది వైద్య విద్య అభ్యసిస్తున్నారు. వారిని భారత్కు తరలించేందుకు సిద్ధం చేస్తున్నారు అధికారులు. ముంబయిలో 423 సీట్లతో కూడిన జంబో విమానాన్ని సిద్ధంగా ఉంచారు. చైనాలోని వుహాన్ నగరం నుంచి తొలి విడతగా శుక్రవారం కొంతమంది భారతీయులను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది భారత్.
విద్యార్థులతో సంప్రదింపులు..
హుబేయ్ రాష్ట్రంలో నివసిస్తున్న 600మంది భారతీయులతో సంప్రదింపులు జరిపి, వారు భారత్కు రావాలనుకుంటున్నారో లేదో తెలుసుకున్నట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకూ అక్కడి భారతీయుల్లో వైరస్ సోకినట్లు ఎలాంటి కేసూ నమోదు కాలేదని తెలిపింది.
భారత్ నిర్ణయంతో ఊరట!